AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడు మాజీ మంత్రి కన్నుమూత

తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి రెహ్మాన్‌ ఖాన్‌ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైనా ఆయన.. గురువారం నాడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డీఎంకే..

తమిళనాడు మాజీ మంత్రి కన్నుమూత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 20, 2020 | 8:37 PM

Share

తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి రెహ్మాన్‌ ఖాన్‌ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైనా ఆయన.. గురువారం నాడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డీఎంకే పార్టీకి చెందిన రెహ్మాన్‌..పార్టీలో ఉన్నత స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటిలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన కరుణానిధి కేబినెట్‌లో 1996-2001 మధ్య మంత్రిగా వ్యవహరించారు. రెహ్మాన్ ఖాన్ మృతితో డీఎంకేలో విషాద చాయలు అలుముకున్నాయి. డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ రెహ్మాన్‌ మృతిపట్ల సంతాపం తెలిపారు. అరివాలయంలోని పార్టీ ఆఫీసులో పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అంతేకాదు పార్టీ కార్యాలయంపై ఉన్న జెండాలను అవనతం చేశారు. మూడు రోజుల పాటుగా అన్ని కార్యక్రమాలను వాయిదా వేశారు.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్