Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈతకోసమని వెళ్లి నీటిలో మునిగిపోయిన ఇద్దరు యువకులు.. వారిని రక్షించేందుకు దూకిన మరో ముగ్గురు.. చివరికి

గుజరాత్‌లోని బొటాడ్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగ ఈత కోసం వెళ్లిన యువకులు నీటిలోనే మునిగి గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి ఇద్దరు యువకులు కృష్ణసాగర్ నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నీటిలోకి దిగారు. అయితే ఒక్కసారిగా లోతులోకి దిగిపోవడంతో కేకలు వేశారు. వీళ్లు అలా కేకలు వేయడాన్ని అక్కడ ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు గమనించారు.

ఈతకోసమని వెళ్లి నీటిలో మునిగిపోయిన ఇద్దరు యువకులు.. వారిని రక్షించేందుకు దూకిన మరో ముగ్గురు.. చివరికి
Drowning
Follow us
Aravind B

|

Updated on: May 14, 2023 | 11:47 AM

గుజరాత్‌లోని బొటాడ్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగ ఈత కోసం వెళ్లిన యువకులు నీటిలోనే మునిగి గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి ఇద్దరు యువకులు కృష్ణసాగర్ నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నీటిలోకి దిగారు. అయితే ఒక్కసారిగా లోతులోకి దిగిపోవడంతో కేకలు వేశారు. వీళ్లు అలా కేకలు వేయడాన్ని అక్కడ ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు గమనించారు. నీటిలో మునిగిపోతున్న ఆ ఇద్దర్ని రక్షించేందుకు ఈ ముగ్గరు కూడా నదిలోకి దూకారు. వాళ్లని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆ ఐదుగురు కూడ నీటిలోనే మునిగిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చివరికి ఆ ఐదుగురి మృతదేహాలని బయటికి తీశారు. అయితే ఈత కొట్టేందుకు వచ్చి ఇద్దరు నీటిలో మునిగిపోయినట్లు బాటోడ్ ఎస్పీ కిశోర్ బలోవియా అన్నారు. వీరిని రక్షించేందుకు మగ్గురు నీటిలో దూకగా కాపాడే ప్రయత్నంలో ఈ ముగ్గరు కూడా నీట మునగిపోయినట్లు పేర్కొన్నారు. మృతులందరి వయసు 16 నుంచి 17 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఐదుగురు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.