Accident: వేగంగా దూసుకొచ్చిన మృత్యువు.. ఐదుగురు మృతి.. భయానకంగా మారిన స్పాట్..
రాజస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్ఘర్ జిల్లాలో అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. కారు, ట్రక్కు ఢీ కొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం....

రాజస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్ఘర్ జిల్లాలో అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. కారు, ట్రక్కు ఢీ కొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని మెగా హైవేపై బిస్రాసర్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. చికిత్స అందించేందుకు క్షతగాత్రులను పల్లు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసంబికనీర్కు తీసుకెళ్లారు. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇటుకల లోడ్ తో వెళ్తున్న ట్రక్కు.. పల్లు నుంచి సర్దార్ నగరం వైపు వెళ్తోంది. అదే సమయంలో కారును ఢీ కొట్టిందని పల్లు పోలీస్ స్టేషన్ అధికారి గోపిరామ్ తెలిపారు.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించగా అక్కడ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ధ్రువీకరించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. క్షతగాత్రుల హాహాకారాలు, బంధువుల రోదనలతో ప్రమాద స్థలం భయానకంగా మారింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం