Trending: పోలీస్ ఇంట్లో చోరీ.. దొంగలను పట్టుకోవాలని బాబాను ఆశ్రయిస్తే.. ఊహించని ట్విస్ట్..
దొంగతనాలు లేదా దోపిడీలు జరిగినప్పుడు సాధారణంగా పోలీసులను ఆశ్రయిస్తుంటాం. బాధ్యులను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటుంటారు. కానీ ఆ పోలీసుల ఇంట్లోనే చోరీ జరిగితే... వాళ్లెవరిని ఆశ్రయించాలి.....

దొంగతనాలు లేదా దోపిడీలు జరిగినప్పుడు సాధారణంగా పోలీసులను ఆశ్రయిస్తుంటాం. బాధ్యులను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటుంటారు. కానీ ఆ పోలీసుల ఇంట్లోనే చోరీ జరిగితే… వాళ్లెవరిని ఆశ్రయించాలి.. వీళ్లకీ రక్షకులు ఉన్నారండోయ్.. వారే బాబాలు. ఆగండాగండి.. కోప్పడకండి.. బాబాలు ఏంటి.. పోలీసులను కాపాడడమేంటని ఆలోచిస్తున్నారా..అయితే ఈ స్టోరీ చదివేయండి.. మనదేశంలో బాబాలకు కొదవేముంది చెప్పండి. తాజాగా ఓ పోలీసు అధికారి తన ఇంట్లో చోరీ జరిగితే దొంగలను పట్టుకుని చీల్చి చెండాల్సిన ఆయన వారిని పట్టుకునేందుకు సాయం చేయాలంటూ ఓ బాబాను ఆశ్రయించారు. బాబా కాళ్ల వద్ద కూర్చుని మాట్లాడుతున్న పోలీసు అధికారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన హర్యానాలోని పానిపట్ జిల్లాలో జరిగింది. డిసెంబరు 23 న జరిగిన ఈ ఘటనలో చాందినీ బాగ్ పోలీస్ క్వార్టర్స్లోని ఏఎస్సై కృష్ణకుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. 40 తులాల బంగారం, మూడున్నర లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. దాంతో ఈ ఏఎస్ఐ తాను పనిచేస్తున్న పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. దొంగల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. లాభం లేదనుకున్న ఆయన దొంగలను పట్టుకునేందుకు సాయం చేయాలంటూ పండోఖర్ బాబా ఆశ్రమానికి వెళ్లారు.
తన ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆయనకు వివరించి, దొంగలను పట్టుకోవడంలో సాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన బాబా.. ఆయన ఈ పోలీసు అధికారికి మంచి క్లూ అయితే ఇచ్చారు కానీ… గ్యారంటీ మాత్రం ఇవ్వలేదు. ఇంతకీ బాబా ఏం చెప్పారంటే.. క్లూ మీ పోలీస్ క్వార్టర్స్లోనే ఉందీ.. పంజాబ్ సరిహద్దులకు వెళ్తే దొంగలు దొరుకుతారని చెప్పి, చివరిలో గ్యారెంటీ లేదని చెప్పడం గమనార్హం.




మరిన్ని జాతీయ వార్తల కోసం