AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గృహ నిర్మాణాలకు రూ.10 వేల కోట్లు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. నిర్మాణ దశలోనే సగంలో నిలిచిపోయిన గృహాలకు కేంద్రం ఆర్ధిక సాయం ప్రకటించింది. దీనికోసం రూ.10 వేలకోట్లు ఇవ్వనున్నట్టు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్ధిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. గృహనిర్మాణ, ఎగుమతి రంగాల్లో ఆర్ధిక వృద్ధిపై మంత్రి నిర్మల సీతారామన్ అనేక చర్యలు ప్రకటించారు. అసంపూర్తిగా ఉన్న గృహనిర్మాణ ప్రాజెక్టులకు నిధులు విస్తరించడానికి రూ. […]

గృహ నిర్మాణాలకు రూ.10 వేల కోట్లు  : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 14, 2019 | 6:20 PM

Share

అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. నిర్మాణ దశలోనే సగంలో నిలిచిపోయిన గృహాలకు కేంద్రం ఆర్ధిక సాయం ప్రకటించింది. దీనికోసం రూ.10 వేలకోట్లు ఇవ్వనున్నట్టు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్ధిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. గృహనిర్మాణ, ఎగుమతి రంగాల్లో ఆర్ధిక వృద్ధిపై మంత్రి నిర్మల సీతారామన్ అనేక చర్యలు ప్రకటించారు. అసంపూర్తిగా ఉన్న గృహనిర్మాణ ప్రాజెక్టులకు నిధులు విస్తరించడానికి రూ. 10 వేల కోట్లను ప్రత్యేక విండో ద్వారా సమకూర్చుతామని మంత్రి తెలిపారు. ఈ విధంగా చేయడం ద్వారా సగంలోనే ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ఈ నిధులను ప్రభుత్వంతో పాటు బయటనుంచి కూడా సేకరించనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఇది నాన్ ఎన్‌పీఏ, నాన్ ఎన్‌సీఎల్టీ కింద వర్తింప చేస్తామన్నారు.

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా గృహనిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఇప్పటికే సగంలో ఆగిపోయిన నిర్మాణాలు గానీ, లేక కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న ఉద్యోగులకు కేంద్రం నిర్ణయం ప్రోత్సహించేలా ఉందంటూ ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. హౌసింగ్ యూనిట్ల నిర్మాణంపై ప్రత్యేక విండోను ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బడ్జెట్‌లో గృహ నిర్మాణం నిమిత్తం రూ.45 లక్షలు వరకు రుణం తీసుకున్న వారికి ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తూ కేంద్రం ప్రకటించింది. తాజాగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులు తక్కువ వడ్డీరేటుతో గృహరుణాలు పొందే వీలు కలిగింది.