AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిరాతక తండ్రి దారుణం.. 12ఏళ్ల కొడుకు గొంతుకోసి చంపేసి.. గోనె సంచిలో మృతదేహంతో..

భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, అయితే హత్యకు దారితీసిన విషయం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కిరాతక తండ్రి దారుణం.. 12ఏళ్ల కొడుకు గొంతుకోసి చంపేసి.. గోనె సంచిలో మృతదేహంతో..
Father Killed Son
Jyothi Gadda
|

Updated on: Feb 17, 2023 | 12:22 PM

Share

ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని అంబర్‌నాథ్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడిని కన్న తండ్రే అతి కిరాతకంగా తండ్రి గొంతు కోసి చంపాడు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పారవేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. నిందితుడిని ఆనంద్ గణేశన్‌గా గుర్తించి పోలీసులకు అప్పగించారు. అంబర్‌నాథ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఆనంద్ గణేశన్ తన కుమారుడి మృతదేహాన్ని రైల్వే ట్రాక్ సమీపంలోని డ్రెయిన్‌లో పడేసేందుకు గోనె సంచిలో తీసుకెళ్తున్నాడు. అనుమానం వచ్చిన స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆనంద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఫిబ్రవరి 21 వరకు పోలీసు కస్టడీకి పంపారు. కుమారుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉల్లాస్‌నగర్‌ సెంట్రల్‌ ఆస్పత్రికి తరలించారు.

కుటుంబ కలహాల కారణంగా ఆనంద్, అతని భార్య విడివిడిగా నివసిస్తున్నారని కుమారుడు తన భార్యతో కలిసి ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. వారికి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరూ తల్లితోనే కలిసి ఉండేవారు. పిల్లలను కలిసేందుకు తరచూ వస్తుండేవాడు గణేశన్‌. అలా వచ్చిన ప్రతిసారి భార్యతో తరచూ గొడవపడేవాడని చెప్పారు. ఈ క్రమంలోనే బుధవారం ఆనంద్ తన 12 ఏళ్ల కుమారుడు ఆకాష్‌ను ఎవరికీ చెప్పకుండా అంబర్‌నాథ్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆకాష్‌ను పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని తప్పించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే పట్టుబడ్డాడు.

ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి గోనె సంచిలో మృతదేహాన్ని చూశానని చెప్పాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఆనంద్‌ను పట్టుకుని గన్నీ బ్యాగ్‌ని రైల్వే ట్రాక్‌ సమీపంలోని కాలువలో పడేశారు. స్థానికుల సహాయంతో అతడిని అరెస్టు చేసేందుకు ముందు అతడు గోనె సంచిని పాన్ షాపు వెనుక దాచాడు. విచారణ అనంతరం పోలీసులు మృతదేహాన్ని అక్కడికక్కడే స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, అయితే హత్యకు దారితీసిన విషయం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..