AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవుల్లో ఆగని ఏరివేత.. జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు కమాండర్ మృతి!

దౌనా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో మావోయిస్టు నాయకుడు కుందన్ ఖోర్వార్‌ను అరెస్టు చేశారు. జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలోని జవాన్లు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం ఉదయం వరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో వారు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

అడవుల్లో ఆగని ఏరివేత.. జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు కమాండర్ మృతి!
Encounter
Jyothi Gadda
|

Updated on: May 27, 2025 | 2:12 PM

Share

జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు కమాండర్ నితేష్ యాదవ్ మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. దౌనా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో మావోయిస్టు నాయకుడు కుందన్ ఖోర్వార్‌ను అరెస్టు చేశారు. జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలోని జవాన్లు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం ఉదయం వరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో వారు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పాలము జిల్లాలోని హుస్సేనాబాద్ సబ్ డివిజన్‌లో సోమవారం రాత్రి ఎన్‌కౌంటర్ ప్రారంభమై మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతమంతా భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మిగిలిన మావోయిస్టు కేడర్లను నిర్మూలించడానికి భద్రతా సిబ్బంది ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పలము పోలీస్ సూపరింటెండెంట్ రిష్మా రమేషన్, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..