AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ED Raids: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ యాక్షన్‌ షురూ.. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 32 చోట్ల దాడులు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ యాక్షన్‌ షురూ అయింది. మంగళవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 32 చోట్ల దాడులు నిర్వహిస్తోంది.

ED Raids: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ యాక్షన్‌ షురూ.. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 32 చోట్ల దాడులు
Ed
Shaik Madar Saheb
|

Updated on: Sep 06, 2022 | 10:09 AM

Share

Enforcement Directorate Raids in Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ యాక్షన్‌ షురూ అయింది. మంగళవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 32 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం, మనీలాండరింగ్‌ వ్యవహారంపై కేసుకు సంబంధించి ఈడీ హైదరాబాద్ సహా ప్రధాన నరగాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, లక్నో, బెంగళూరు, గుర్గావ్‌, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో దాదాపు 32 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో అరుణ్‌ రామచంద్రపిళ్లైతో సహా మరో ఐదుగురి ఇళ్లలో దాడులు చేపట్టింది. అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లలో సహా రాబిన్ డిస్టిలర్స్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ నిరంతరం ఆరోపిస్తోంది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మద్యం మాఫియాకు కోట్లాది రూపాయల రుణమాఫీ చేసిందని బీజేపీ ఆరోపించింది. దీంతో ఆదాయానికి గండి పడుతోందంటూ పేర్కొంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా, సహా పలువురిని ఈడీ అధికారులు విచారించారు. దీంతోపాటు ఈ స్కాంలో పలువురి హస్తంపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. దీంతో ఈడీ ఈ కేసులో దూకూడు పెంచినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..