AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pralhad Joshi: ఈసీపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి కౌంటర్!

కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి కౌంటర్ ఇచ్చారు. రాహుల్‌ ఎలాంటి ఆధారాలు లేకుండా ఈసీపై ఆరోపణలు చేశారన్నారు. గతంలో చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వమని అతనికి ఈసీ లేఖ రాసిందని.. వాటిపై ఆయన ఇంకా స్పందించలేదని అన్నారు. ఎందుకంటే ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.

Pralhad Joshi: ఈసీపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి కౌంటర్!
Pralhad Joshi
Anand T
|

Updated on: Aug 08, 2025 | 8:05 PM

Share

కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రంమంత్రి ప్రహ్లాద్‌ జోషి కౌంటర్ ఇచ్చారు. రాహుల్‌ ఎలాంటి ఆధారాలు లేకుండా ఈసీపై ఆరోపణలు చేశారన్నారు. గతంలో చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని అతనికి ఈసీ లేఖ రాసిందని వాటిపై ఆయన ఇంకా స్పందించలేదని అన్నారు. ఎందుకంటే ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు. ఈ విషయంలో అధికారిక చర్యలను ప్రారంభించడానికి సంతకం చేసిన అఫిడవిట్‌ను సమర్పించాలని మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీని కోరారని.. కానీ ఆయన ఇప్పటివరకు వాటిని సమర్పించలేదని కేంద్రమంత్రి తెలిపారు.

రాహుల్ గాంధీని ప్రజలు అధికారం నుండి తొలగించిన తర్వాత, ఆయన అబద్ధాల దుకాణం మొదలు పెట్టాడని కేంద్రమంత్రి ఎగతాలి చేశారు. రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని ఎమర్జెన్సీ విధించిన నాటి ఇందిరా గాంధీ నుంచి వారు రాజ్యాంగ సంస్థల గురించి తమకు నచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో సమయంలో 70 లక్షల మంది ఓటర్లు అదనంగా చేరారని ఆయన చెప్పారు. కానీ చేరింది 40 లక్షల మంది ఓటర్లేనని ఈసీ స్పష్టం చేసిందని ఆయన అన్నారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలోనూ ఆయన కోటి మంది ఓటర్లు పెరిగారని అన్నారు. రాఫెల్ అంశంపై కూడా ఆయన అబద్ధం చెప్పారని ఆయన అన్నారు. 2004, 2009లో యుపీఎ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఎన్డీఏ హయాంలో కూడా ఇది పెరిగిందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్