AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాకు తగిన సమాధానం ఇచ్చేందుకు భారతదేశం సిద్ధంగా ఉందిః అశ్విని వైష్ణవ్

చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారతదేశం ఒక కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దీని కారణంగా రాబోయే కాలంలో చైనాపై ఆ దేశం ఆధారపడటం తగ్గుతుందని భావిస్తున్నారు. భారతదేశం ప్రణాళిక ఏమిటో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ ECMS మార్గదర్శకాలపై ఒక పోర్టల్‌‌ను అవిష్కరించారు.

చైనాకు తగిన సమాధానం ఇచ్చేందుకు భారతదేశం సిద్ధంగా ఉందిః అశ్విని వైష్ణవ్
India China Trade
Balaraju Goud
|

Updated on: Apr 26, 2025 | 9:39 PM

Share

చైనా కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారతదేశం ఒక ప్రణాళికపై పనిచేస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాన్ని పొందాలంటే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలు డిజైన్ బృందాలను సృష్టించడంతో పాటు అద్భుతమైన నాణ్యమైన పనిని చేయాల్సి ఉంటుందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ దీని కోసం ఎటువంటి అధికారిక ప్రణాళికను రూపొందించదని, అయితే ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పథకం అయిన ECMS కోసం దరఖాస్తులను ఆమోదించే ముందు నాణ్యత, ఉత్పత్తి అంశాలపై పని చేస్తుందని కేంద్ర మంత్రి అన్నారు.

ఈ పథకంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఒక డిజైన్ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనిని ఆమోదం కోసం అధికారిక ప్రమాణంగా చేర్చలేదు, కానీ ఇది ఆమోదం కోసం అనధికారిక ప్రమాణం లాంటిదన్నారు. ECMS మార్గదర్శకాలపై శనివారం(ఏప్రిల్ 26) ఒక పోర్టల్‌ను ప్రారంభిస్తూ, కొన్ని కంపెనీలు 5,000 మంది ఇంజనీర్లతో కూడిన డిజైన్ బృందాలను సృష్టించాయని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. డిజైన్ బృందం లేకపోతే, మీరు మీ అన్ని ప్రమాణాలను నెరవేర్చినప్పటికీ, పని చేయడానికి అనుమతి ఇవ్వమని వైష్ణవ్ తేల్చి చెప్పారు. అన్ని కంపెనీలు ఒక డిజైన్ బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇది లేకుండా, ఈ రంగంలో పని చేయలేమన్నారు కేంద్ర మంత్రి.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మీరు చేసే ప్రతి పనిలో సిక్స్ సిగ్మా నాణ్యతను సాధించమని చెప్పారు. సిక్స్ సిగ్మా కంటే తక్కువ ఏదైనా మంచిది కాదన్న మంత్రి. ఉత్పత్తిని మాత్రమే కాకుండా, ఉత్పత్తి చేసిన వస్తువుల నాణ్యతను కూడా తనిఖీ చేస్తామన్నారు. సిక్స్ సిగ్మా అనేది మన పనిలో లోపాలను తగ్గించి, విషయాలను మెరుగుపరుచుకోవడానికి ఒక మార్గమన్నారు. మనం దీనిపై సరిగ్గా పని చేస్తే, ఎలక్ట్రానిక్ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
WhatsAppలో నకిలీ వాటర్ బిల్లు మెసేజ్.. ఒక్క క్లిక్‌తో 4 లక్షలు..
WhatsAppలో నకిలీ వాటర్ బిల్లు మెసేజ్.. ఒక్క క్లిక్‌తో 4 లక్షలు..
ఎనర్జీ డ్రింక్స్‌పై తాగే వారికి హెచ్చరిక!డార్క్ రియాలిటీ తెలిస్తే
ఎనర్జీ డ్రింక్స్‌పై తాగే వారికి హెచ్చరిక!డార్క్ రియాలిటీ తెలిస్తే
ఇంగ్లాండ్‌లోనే ముగిసిన ఈ ముగ్గురి కెరీర్.. పిలిచి ఛాన్స్ ఇస్తే..
ఇంగ్లాండ్‌లోనే ముగిసిన ఈ ముగ్గురి కెరీర్.. పిలిచి ఛాన్స్ ఇస్తే..
పెంపకం కేంద్రం నుంచి తప్పించుకున్న 900 పాములు!
పెంపకం కేంద్రం నుంచి తప్పించుకున్న 900 పాములు!
సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌
సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌
వర్షాకాలంలో స్పైసీ స్నాక్.. చెట్టినాడ్ స్టైల్ రొయ్యల ఫ్రై
వర్షాకాలంలో స్పైసీ స్నాక్.. చెట్టినాడ్ స్టైల్ రొయ్యల ఫ్రై
భర్తను కాదని ప్రియుడితో పారిపోవాలనుకునే భార్య.. క్షణ క్షణం ఉత్కంఠ
భర్తను కాదని ప్రియుడితో పారిపోవాలనుకునే భార్య.. క్షణ క్షణం ఉత్కంఠ
నెలలోపే ఓటీటీలో... బిగ్‌ స్క్రీన్‌కు భారీ గండి
నెలలోపే ఓటీటీలో... బిగ్‌ స్క్రీన్‌కు భారీ గండి
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రాక్టికల్ పరీక్షల..
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రాక్టికల్ పరీక్షల..
గంభీర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్స్.. చుట్టుముట్టి మరీ ఏం చేశారంటే?
గంభీర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్స్.. చుట్టుముట్టి మరీ ఏం చేశారంటే?