AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాకు తగిన సమాధానం ఇచ్చేందుకు భారతదేశం సిద్ధంగా ఉందిః అశ్విని వైష్ణవ్

చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారతదేశం ఒక కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దీని కారణంగా రాబోయే కాలంలో చైనాపై ఆ దేశం ఆధారపడటం తగ్గుతుందని భావిస్తున్నారు. భారతదేశం ప్రణాళిక ఏమిటో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ ECMS మార్గదర్శకాలపై ఒక పోర్టల్‌‌ను అవిష్కరించారు.

చైనాకు తగిన సమాధానం ఇచ్చేందుకు భారతదేశం సిద్ధంగా ఉందిః అశ్విని వైష్ణవ్
India China Trade
Balaraju Goud
|

Updated on: Apr 26, 2025 | 9:39 PM

Share

చైనా కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారతదేశం ఒక ప్రణాళికపై పనిచేస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాన్ని పొందాలంటే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలు డిజైన్ బృందాలను సృష్టించడంతో పాటు అద్భుతమైన నాణ్యమైన పనిని చేయాల్సి ఉంటుందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ దీని కోసం ఎటువంటి అధికారిక ప్రణాళికను రూపొందించదని, అయితే ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పథకం అయిన ECMS కోసం దరఖాస్తులను ఆమోదించే ముందు నాణ్యత, ఉత్పత్తి అంశాలపై పని చేస్తుందని కేంద్ర మంత్రి అన్నారు.

ఈ పథకంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఒక డిజైన్ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనిని ఆమోదం కోసం అధికారిక ప్రమాణంగా చేర్చలేదు, కానీ ఇది ఆమోదం కోసం అనధికారిక ప్రమాణం లాంటిదన్నారు. ECMS మార్గదర్శకాలపై శనివారం(ఏప్రిల్ 26) ఒక పోర్టల్‌ను ప్రారంభిస్తూ, కొన్ని కంపెనీలు 5,000 మంది ఇంజనీర్లతో కూడిన డిజైన్ బృందాలను సృష్టించాయని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. డిజైన్ బృందం లేకపోతే, మీరు మీ అన్ని ప్రమాణాలను నెరవేర్చినప్పటికీ, పని చేయడానికి అనుమతి ఇవ్వమని వైష్ణవ్ తేల్చి చెప్పారు. అన్ని కంపెనీలు ఒక డిజైన్ బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇది లేకుండా, ఈ రంగంలో పని చేయలేమన్నారు కేంద్ర మంత్రి.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మీరు చేసే ప్రతి పనిలో సిక్స్ సిగ్మా నాణ్యతను సాధించమని చెప్పారు. సిక్స్ సిగ్మా కంటే తక్కువ ఏదైనా మంచిది కాదన్న మంత్రి. ఉత్పత్తిని మాత్రమే కాకుండా, ఉత్పత్తి చేసిన వస్తువుల నాణ్యతను కూడా తనిఖీ చేస్తామన్నారు. సిక్స్ సిగ్మా అనేది మన పనిలో లోపాలను తగ్గించి, విషయాలను మెరుగుపరుచుకోవడానికి ఒక మార్గమన్నారు. మనం దీనిపై సరిగ్గా పని చేస్తే, ఎలక్ట్రానిక్ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..