Delhi: భోజనం వడ్డించలేదని భార్యను చంపిన భర్త.. రాత్రంతా మృతదేహంతోనే..!

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో ఓ భర్త మద్యం మత్తులో తన భార్యను హత్య చేశాడు.

Delhi: భోజనం వడ్డించలేదని భార్యను చంపిన భర్త.. రాత్రంతా మృతదేహంతోనే..!
Food
Follow us

|

Updated on: Jun 19, 2022 | 5:52 AM

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో ఓ భర్త మద్యం మత్తులో తన భార్యను హత్య చేశాడు. భోజనం వడ్డించే విషయంలో జరిగిన చిన్న వివాదమే ఈ ఘటనకు కారణం. వివరాల్లోకెళితే.. ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో ఓ భర్త మద్యం మత్తులో భార్యను హత్య చేశాడు. భోజనం వడ్డించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్యను ఉపిరాడకుండా చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. 39 ఏళ్ల సోనాలి తన భర్త 47 ఏళ్ల వినోద్ కుమార్ దూబేతో కలిసి సుల్తాన్‌పూర్‌లో నివసిస్తోంది. వారిద్దరూ 2008లో వివాహం చేసుకున్నారు. కరోనా తరువాత, వినోద్ నిరుద్యోగిగా మారాడు. గురువారం అర్థరాత్రి భార్యాభర్తలిద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత సోనాలిని భోజనం వడ్డించమని వినోద్ కోరగా, ఆమె అందుకు నిరాకరించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో.. సోనాలి గొంతును దిండుతో బిగించాడు వినోద్. దీంతో ఆమె ఆపస్మాకరస్థితిలో వెళ్లిపోయింది.

రాత్రంతా భార్యతో కలిసి నిద్రించిన అతడు ఉదయం మత్తు తగ్గడంతో ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆమె మృతి చెందడంతో ఈ విషయాన్ని వినోద్ తన స్నేహితుడికి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వినోద్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని.. హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.