AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Lawyer filed case: ఆ కంపెనీలను మూసేయాలంటూ.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు దిల్లీ లాయర్ ఫిర్యాదు..

Delhi Lawyer filed case: దిల్లీకి చెందిన ఓ లాయర్ హ్యుందాయ్, కేఎఫ్ సి, పిజ్జా హట్, కియా సంస్థల భారత విభాగాలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Delhi Lawyer filed case: ఆ కంపెనీలను మూసేయాలంటూ.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు దిల్లీ లాయర్ ఫిర్యాదు..
Delhi Lawer Complaint
Ayyappa Mamidi
|

Updated on: Feb 10, 2022 | 6:20 PM

Share

Delhi Lawyer filed case: దిల్లీకి చెందిన ఓ లాయర్ హ్యుందాయ్, కేఎఫ్ సి, పిజ్జా హట్, కియా సంస్థల భారత విభాగాలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీలను రెజిస్ట్రేషన్ రద్దు చేయాలని.. ఆ సంస్థలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. వారు ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని లాయర్ వినీత్ జిందాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అంతర్జాలంలో ఇప్పటికే తీవ్రస్థాయిలో వ్యతిరేకత మెుదలైందని వివరించారు. ఈ కంపెనీ దేశంలో వారి వ్యాపారాలు కొనసాగకుండా నిలువరించాలన్నారు. ఐపీసీ, ఐటి చట్టంలోని 121A, 153, 153a, 504, 505 సెక్షన్ల కింద చర్యలు చేపట్టాలని కోరారు.

పాకిస్థాన్ కు అనుకూలంగా.. భారత్ పై వివాదాస్పద వ్యాఖలు చేసిన బహుళజాతి కంపెనీలు పాకిస్థాన్ లోని తమ వ్యాపార అవసరాల కోసం చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని అంతర్జాల వేదికల్లో చూసిన లక్షల మంది తీవ్రంగా మండిపడుతున్నారన్నారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగే ప్రమాదం పొంచి ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా భారత్ పాక్ ల మధ్య కశ్మీర్ వివాదం నడుస్తోందని.. అది ఒక సున్నితమైన అంశమని అన్నారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ప్రపంచానికి తెలుసునని గుర్తుచేశారు. ఈ వివాదం వల్ల రెండు దేశాల మధ్య రాన్ను కాలంలో వివాదం చెలరేగే ప్రమాదం ఉందని అన్నారు.

ప్రస్తుతం ట్విట్టర్ విధికగా కంపెనీలు చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలను రెట్టగొట్టేవిధంగా, దేశంలో ఘర్షణ వాతారవణాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని వివరించారు. దీనివల్ల శాంతి, స్నేహభావం దెబ్బతినే ప్రమాదం ఉన్నందున.. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి కంపెనీలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విషయంపై ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి.. హ్యుందాయ్ సంస్థ సామాజిక మాధ్యమాల్లో కశ్మీర్ విషయంపై పోస్టులు చేయగానే సియోల్​లోని భారత రాయబారి.. ఆ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించారు. దీనిపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. సోమవారం భారత విదేశాంగ శాఖ.. దక్షిణ కొరియా రాయబారికి సమన్లు కూడా పంపింది.

ఇవీ చదవండి…

Imran Khan China Trip: పాపం ఇమ్రాన్.. బీజింగ్‌లో బకరా అయిన పాక్ ప్రధాని.. ఆ ఫోటో ఒక్కటే మహాభాగ్యం అంటూ సెటైర్లు.

Hyundai Tweets: కశ్మీర్ విషయంపై వివాదంగా మారిన ఆ కంపెనీల ట్వీట్లు.. దక్షిణ కొరియా అంబాసిడర్ కు భారత్ సమన్లు..

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?