AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinese Manja Death: సంక్రాంతి రాకుండానే తెగిన గొంతు.. చైనా మంజాతో పోయిన ప్రాణం..

గాలు పటం ఎగిరింది..యువకుడి గొంతు తెగింది. క్షణాల్లో ప్రాణం పోయింది.. ఇదేదో ప్రాస కోసం చెప్పింది కాదు.. వాస్తవంలో జరిగిన చేదు వాస్తవం. ఒకటా రెండా దాని పంజా దెబ్బకు పక్షుల ప్రాణాలే కాదు మనుషుల ప్రాణాలు పోతున్నాయి.

Chinese Manja Death: సంక్రాంతి రాకుండానే తెగిన గొంతు.. చైనా మంజాతో పోయిన ప్రాణం..
Chinese Manjha
Sanjay Kasula
|

Updated on: Jul 27, 2022 | 6:19 PM

Share

గాలు పటం ఎగిరింది..యువకుడి గొంతు తెగింది. క్షణాల్లో ప్రాణం పోయింది.. ఇదేదో ప్రాస కోసం చెప్పింది కాదు.. వాస్తవంలో జరిగిన చేదు వాస్తవం. కత్తులకంటే పదునుగా కుత్తుకలు కత్తిరిస్తున్నాయి. మాంజాపై నిషేధం ఉన్నా, చట్టప్రకారం శిక్షలు పడతాయని హెచ్చరిస్తున్నా అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. మాంజాను అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసి కఠినమైన శిక్షలు పడతాయని హెచ్చరిస్తున్నారు. ఒకటా రెండా దాని పంజా దెబ్బకు పక్షుల ప్రాణాలే కాదు మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ప్రభుత్వాలు నిషేధించినా చాటు మాటున వచ్చిన ఈ చైనా సరుకు.. ఉసురు తీస్తోంది. సంక్రాంతి రాకుండానే ఇలా ప్రాణం పోయింది. కానీ.. ఈ మాంజాను వాడితే ఎంత ప్రమాదమో ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది చెవులకు ఎక్కడంలేదు. 

దేశ రాజధాని ఢిల్లీలో చైనా మాంజా బీభత్సం మరోసారి కనిపించింది. ఈ మాంజా వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని హైదర్‌పూర్ ఫ్లైఓవర్‌లో బైక్ రైడర్‌ని చైనా మాంజా ఢీకొట్టింది. అతని మెడను మాంజా నరికేసింది. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ బాధాకరమైన సంఘటన జూలై 25న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్ తన దుకాణం మూసి బురారీ ప్రాంతం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. హైదర్‌పూర్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్న సుమిత్ చైనీస్ మాంజా ఢీకొనడంతో గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

చైనీస్ మాంజా విధ్వంసం

దేశంలోని చాలా ప్రాంతాల్లో చైనీస్ మాంజా మరణాల నివేదికలు ఉన్నాయి. ఆగస్టు నెల ఇంకా ప్రారంభం కాకపోవడంతో చైనా మాంఝా బీభత్సం సృష్టించింది. ప్రతి సంవత్సరం ఈ గాలిపటం దారం పట్టి చాలా మంది గాయపడుతుండగా మరికొందరు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. 

మృతుడు సుమిత్ తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్‌కు బురారీలో హార్డ్‌వేర్ షాప్ ఉంది. సుమిత్ దుకాణం మూసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై విచారణ జరుగుతోంది, అయితే ఈ చైనీస్ మాంజా ఒక కుటుంబంలోని ఆనందాన్ని దూరం చేసింది. 

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు
అద్భుతం.. నగరం నడిఒడ్డున నాగుపాముల సయ్యాట.. ఇదిగో వీడియో
అద్భుతం.. నగరం నడిఒడ్డున నాగుపాముల సయ్యాట.. ఇదిగో వీడియో
ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్.. ఈ ప్లేయింగ్ 11 చూస్తే వణికిపోవాల్సిందే
ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్.. ఈ ప్లేయింగ్ 11 చూస్తే వణికిపోవాల్సిందే
రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..
రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..
చమురుపై అమెరికా ఆంక్షలు..పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స
చమురుపై అమెరికా ఆంక్షలు..పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స
ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. విపత్కర పరిస్థితులు..!
ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. విపత్కర పరిస్థితులు..!
ఓయోకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త
ఓయోకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త
రూ.50 నోటుపై ఉన్న ఈ రథం చూశారా?రాతి స్తంభాల నుండి సంగీతం వినాలంటే
రూ.50 నోటుపై ఉన్న ఈ రథం చూశారా?రాతి స్తంభాల నుండి సంగీతం వినాలంటే
మృగశిర కార్తెలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసా?
మృగశిర కార్తెలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసా?
ఆ హీరోయిన్ చాలా స్పెషల్.
ఆ హీరోయిన్ చాలా స్పెషల్.