Covid New Variant: డేంజర్‌బెల్‌ మోగిస్తున్న కొత్త వేరియంట్‌.. మాస్క్‌ తప్పనిసరి.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిపుణులతో మాట్లాడినట్లు మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. అంటువ్యాధుల నివారణకు తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ఈ మేరకు నిపుణులతో ఆయన సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా సోకిన వారు 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. వ్యాధి సోకిన వారికి 7 రోజుల సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని అధికారులు పర్యవేక్షిస్తారు. ఉదాహరణకు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఉన్న ..

Covid New Variant: డేంజర్‌బెల్‌ మోగిస్తున్న కొత్త వేరియంట్‌.. మాస్క్‌ తప్పనిసరి.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Covid Mask
Follow us

|

Updated on: Dec 27, 2023 | 9:20 AM

దేశంలో కరోనా మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో కొత్త వేరియంట్‌ డేంజర్‌ బెల్‌ మోగిస్తుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా వేరియంట్ అయిన JN.1 (COVID సబ్‌వేరియంట్ JN1) కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా బుధవారం కేరళ రాష్ట్రంలో కొత్తగా 74 కోవిడ్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. దక్షిణ కన్నడ, మైసూరు జిల్లాలో ఒక్కొక్కరు ఒక్కో బాధితుడు. బెంగళూరులో ఇవాళ కొత్తగా 57 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. హాసన్ 4, బెంగళూరు రూరల్ జిల్లాలో 4, చిక్కబల్లాపూర్ 3, మాండ్య, మైసూర్ జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటకలో మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అల ఆలాగే బాధితులకు 7 రోజుల క్వారంటైన్‌ విధించింది. JN.1 పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో సిద్ధరామయ్య సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అందించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 464, బెంగళూరులో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 376, రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 1.15%.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిపుణులతో మాట్లాడినట్లు మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. అంటువ్యాధుల నివారణకు తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ఈ మేరకు నిపుణులతో ఆయన సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా సోకిన వారు 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. వ్యాధి సోకిన వారికి 7 రోజుల సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని అధికారులు పర్యవేక్షిస్తారు. ఉదాహరణకు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపవద్దని మంత్రి సూచించారు.

మాస్క్ ధరించడం మంచిదని, ఇందుకు సంబంధించి నిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. రేపటి నుంచి రాష్ట్రంలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు రోజూ 5 వేల కోవిడ్ పరీక్షలు చేయనున్నారు. జిల్లా, తాలూకా ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్ కోసం చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

60 ఏళ్లు పైబడిన వారు మాస్క్ ధరించడం తప్పనిసరి

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చాలా మంది పర్యాటకులు వస్తారు కాబట్టి 60 ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఇండోర్ ఈవెంట్‌లకు హాజరైన వారిని కోవిడ్-19 లక్షణాల కోసం పరీక్షించి, లోపలికి అనుమతించాలి. 60 ఏళ్లు పైబడిన వారు బహిరంగ కార్యక్రమాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి