AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mizoram Polling Result: మిజోరాంలో కొనసాగుతున్న కౌంటింగ్.. పెద్దగా ప్రభావం చూపని బీజేపీ, కాంగ్రెస్

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిశంబర్ 3న వెల్లడైనప్పటికీ.. మిజోరాంలో మాత్రం సోమవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. మొత్తం 13 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Mizoram Polling Result: మిజోరాంలో కొనసాగుతున్న కౌంటింగ్.. పెద్దగా ప్రభావం చూపని బీజేపీ, కాంగ్రెస్
Counting Of Assembly Elections In Mizoram Is Ongoing
Srikar T
|

Updated on: Dec 04, 2023 | 8:57 AM

Share

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిశంబర్ 3న వెల్లడైనప్పటికీ.. మిజోరాంలో మాత్రం సోమవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. మొత్తం 13 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మిజోరాం రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి హెచ్. లియాంజెలా తెలిపారు. ఈ రాష్ట్రంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 80శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 174 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగారు.

మిజోరాంలో మొత్తం 40 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మూడు పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇందులో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరం పీపుల్స్ మూవ్ మెంట్ (జడ్ పీ ఎం), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26, జడ్ పీ ఎం 8, కాంగ్రెస్ 5, బీజేపీ 1 స్థానంలో గెలుపొందాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ స్థానాలు 21 కాగా గతంలో ఎంఎన్ఎఫ్ 26 స్థానాలను కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించిన దానిప్రకారం మరో సారి మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని తెలిపింది. జోరం పీపుల్స్ పల్స్ 12 నుంచి 18 స్థానాలు కైవసం చేసుకొని రెండవ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని అంచనా వేసింది. బీజేపీ, కాంగ్రెస్ ల ప్రభావం పెద్దగా ఉండదని తేల్చింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్ ప్రకారం జడ్ పీ ఎం 13, ఎంఎన్ఎఫ్ 8, బీజేపీ 2, కాంగ్రెస్ 2 స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్