AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిండి లేదు..చచ్చిపోతాం.. ఓ పేద కుటుంబం మొర.. ఖాకీల మానవత

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పేదల పాలిట శాపంగా మారుతోంది. పని దొరకక, తినడానికి పట్టెడన్నం లేక.. అనేకమంది ఆకలి బాధకు గురవుతున్నారు. చండీగఢ్ లో ఓ కుటుంబ దీనావస్థ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

తిండి లేదు..చచ్చిపోతాం.. ఓ పేద కుటుంబం మొర.. ఖాకీల మానవత
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 29, 2020 | 4:44 PM

Share

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పేదల పాలిట శాపంగా మారుతోంది. పని దొరకక, తినడానికి పట్టెడన్నం లేక.. అనేకమంది ఆకలి బాధకు గురవుతున్నారు. చండీగఢ్ లో ఓ కుటుంబ దీనావస్థ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కొన్ని రోజులుగా ఇంట్లో ఆహారం లేక తాను, తన భర్త, అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ పస్తులుంటున్నామని , ఇక  భరించలేక ఆత్మహత్య చేసుకుంటామని ఓ మహిళ విలపిస్తూ పోలీసులకు ఫోన్ చేసింది. తమను ఆదుకునేవారెవరూ లేరని వాపోయింది. దీంతో చలించిపోయిన డీఎస్పీ దిల్ షేర్ సింగ్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో సహా వెంటనే ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి వారికి ఆహారాన్ని అందజేశారు. కొంత నగదు సాయం కూడా చేశారు. చంటిబిడ్డ వైద్యానికి సహాయపడతామని హామీ ఇచ్చారు. వారి ఔదార్యానికి ఆ కుటుంబం ఎంతో కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఇలా ఎంతకాలం ? ఇలాంటి అభాగ్యులను ఎవరైనా ఎంతకాలం ఆదుకుంటారు ? ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ నిర్భాగ్యుల కోసం సహాయక కేంద్రాలు ప్రారంభించాలని మానవతావాదులు కోరుతున్నారు. 21 రోజుల లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తోందా అని లక్షలాది  పేదలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. దేశంలో కరోనా కేసులు వెయ్యికి పైగా పెరిగి.. మృతుల సంఖ్య 25 కి చేరుకున్నట్టు వస్తున్న వార్తలు చూస్తుంటే ప్రభుత్వం లాక్ డౌన్ ని మరికొంతకాలం పొడిగించవచ్ఛుననే భయంకర ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా మహమ్మారి అదుపులోకి రావాలంటే ప్రజలు కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదని ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో తేల్చి చెప్పారు. యూపీ, బీహార్ ప్రభుత్వాలు వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపేందుకు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ.. మరి ఇతర రాష్ట్రాల మాటేమిటని మానవతావాదులు ప్రశ్నిస్తున్నారు.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు