భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో
అస్సాం లోని చిరంగ్ జిల్లాలో జరిగిన భయానక ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. 67 ఏళ్ల వ్యక్తి కోపంతో తన భార్య తలను నరికేశాడు. ఆ తర్వాత తలను తన సైకిల్ బుట్టలో పెట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. అది చూసిన పోలీస్ సిబ్బంది సైతం ఒక్కసారిగా భయపడిపోయారు. భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ చివరకు ఈ ఘాతుకాన్నికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చిరంగ్ జిల్లాకు చెందిన 67 ఏళ్ల బితీష్ హజోంగ్ అతని భార్య బైజంతి మధ్య తరచు గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.
ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. చివరకు బితీష్ కోపంతో పదునైన ఆయుధం తీసుకొని భార్య బైజంతి తల నరికేశాడు. ఆపై తన సైకిల్ బుట్టలో ఆ తలను పెట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు. పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ భయానక ఘటనతో ఆ ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జరిగిన దారుణం తెలిసిన ప్రతి ఒక్కరు విషాదానికి లోనయ్యారు. హజోంగ్ అతని భార్య బైజంతి మధ్య తరచు గొడవలు జరిగేవని చుట్టుపక్కల వారు చెప్పారు. ప్రతిరోజూ చిన్న చిన్న విషయాలకే ఇద్దరు గొడవ పడేవారని అన్నారు. ఇంట్లో జరిగే చిన్నపాటి గొడవలకే ఇంత దారుణానికి ఒడిగట్టాడని ఊహించలేదని అంటున్నారు.
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్పోర్ట్కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

