భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో
అస్సాం లోని చిరంగ్ జిల్లాలో జరిగిన భయానక ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. 67 ఏళ్ల వ్యక్తి కోపంతో తన భార్య తలను నరికేశాడు. ఆ తర్వాత తలను తన సైకిల్ బుట్టలో పెట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. అది చూసిన పోలీస్ సిబ్బంది సైతం ఒక్కసారిగా భయపడిపోయారు. భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ చివరకు ఈ ఘాతుకాన్నికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చిరంగ్ జిల్లాకు చెందిన 67 ఏళ్ల బితీష్ హజోంగ్ అతని భార్య బైజంతి మధ్య తరచు గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.
ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. చివరకు బితీష్ కోపంతో పదునైన ఆయుధం తీసుకొని భార్య బైజంతి తల నరికేశాడు. ఆపై తన సైకిల్ బుట్టలో ఆ తలను పెట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు. పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ భయానక ఘటనతో ఆ ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జరిగిన దారుణం తెలిసిన ప్రతి ఒక్కరు విషాదానికి లోనయ్యారు. హజోంగ్ అతని భార్య బైజంతి మధ్య తరచు గొడవలు జరిగేవని చుట్టుపక్కల వారు చెప్పారు. ప్రతిరోజూ చిన్న చిన్న విషయాలకే ఇద్దరు గొడవ పడేవారని అన్నారు. ఇంట్లో జరిగే చిన్నపాటి గొడవలకే ఇంత దారుణానికి ఒడిగట్టాడని ఊహించలేదని అంటున్నారు.
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!

