హౌతీలపై వైమానిక దాడి.. ఇంధనం అందకుండా.. వీడియో
హౌతీ రెబెల్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడంతో ఈ దాడులు జరుగుతున్నాయి. హౌతీలకు ఇంధనాన్ని అందించే స్థావరాలను ద్వంసం చేయాలనే ఉద్దేశంతో దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. యెమెన్ లోని ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టలేదని హౌతీల ఆదాయ వనరులను దెబ్బతీయాలనే దాడులు చేసినట్లు చెప్పింది.
ఎర్ర సముద్రంలో వాణిజ్య యుద్ధ నౌకలపై హౌతీలు దాడులు ఆపాలనే లక్ష్యంతో అమెరికా సైనిక చర్యను మొదలుపెట్టింది. హౌతీలు ఇకపై దాడులు ఆపాలని లేకుంటే నరకం చూపిస్తామని గతంలోనే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హౌతీలకు మద్దతు ఇవ్వొద్దని ఇరాన్ కు సైతం ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. హౌతీల చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సముద్ర జలాల్లో అమెరికా వాణిజ్య నౌకాదళ నౌకలు స్వేచ్ఛగా వెళ్ళకుండా ఏ ఉగ్రశక్తి ఆపలేదని తెలియజేశారు. గాజాపై ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో పశ్చిమ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలను 2013 నుంచి లక్ష్యంగా చేసుకున్నారు. 2013 నుంచి హౌతీలు అమెరికా యుద్ధ నౌకలే లక్ష్యంగా 174 సార్లు, వాణిజ్య నౌకలే లక్ష్యంగా 145 సార్లు దాడులు చేశారని పెంటగన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్తో ఉద్యోగం పోయింది..
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా!

