AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Manifesto: మహిళలకు ఏడాదికి రూ. లక్ష, యువతకు 30 లక్షల ఉద్యోగాలు, కనీస మద్దతు ధరకు చట్టం.. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే!

Congress Manifesto: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. శుక్రవారం (ఏప్రిల్ 05) విడుదల చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా దీన్ని రిలీజ్ చేశారు. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీస్’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ ప్రకటించింది. ‘న్యాయ్‌ పిల్లర్ల’ పేరుతో 25 గ్యారంటీలను ఐదు భాగాలుగా విభజించింది.

Congress Manifesto: మహిళలకు ఏడాదికి రూ. లక్ష, యువతకు 30 లక్షల ఉద్యోగాలు, కనీస మద్దతు ధరకు చట్టం.. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే!
Congress Manifesto 2024
Balaraju Goud
|

Updated on: Apr 05, 2024 | 12:13 PM

Share

Congress Manifesto:

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. శుక్రవారం (ఏప్రిల్ 05) విడుదల చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా దీన్ని రిలీజ్ చేశారు. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీస్’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ ప్రకటించింది. ‘న్యాయ్‌ పిల్లర్ల’ పేరుతో 25 గ్యారంటీలను ఐదు భాగాలుగా విభజించింది. అందులో సామాజిక న్యాయం, రైతు న్యాయం , కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హామీ ఇచ్చింది. కర్నాటక, తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన విధానాలనే జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టాలని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన చేసింది..నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టోను రూపొందించింది.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రేపు జైపూర్, హైదరాబాద్‌లలో బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రజల ముందు ప్రకటించనున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. జైపూర్‌లో నిర్వహించే మేనిఫెస్టో సంబంధిత ర్యాలీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌లో మేనిఫెస్టో బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. ఈ ర్యాలీల ద్వారా కాంగ్రెస్ నేతలంతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది?

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాల గురించి మాట్లాడితే, ఇందులో కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు, పేద కుటుంబాల మహిళలకు సంవత్సరానికి రూ. 1 లక్ష, కుల గణన, MSPకి చట్టపరమైన హోదా, MNREGA వేతనం రూ. 400, పరిశోధనాత్మక దుర్వినియోగాన్ని అరికట్టడం వంటివి అంశాలను చేర్చింది. PMLA చట్టంలోని ఏజెన్సీలు, మార్పులు ఉంటాయని ప్రకటించింది. సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ప్రకటించారు.

మేనిఫెస్టో పార్టీ ఐదు న్యాయ సూత్రాల ఆధారంగా పని చేస్తుందని మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం తెలిపారు. ‘భాగస్వామ్య న్యాయం’, ‘కిసాన్ న్యాయం’, ‘మహిళా న్యాయం’, ‘కార్మిక న్యాయం’,’యువ న్యాయం’ అంశాలను ప్రస్తావించారు. ‘యువ న్యాయం’ కింద పార్టీ మాట్లాడిన ఐదు హామీల్లో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు ఒక సంవత్సరం పాటు శిక్షణా కార్యక్రమం కింద రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన అంశాలేంటి?

‘భాగస్వామ్య న్యాయం’ కింద కుల గణన నిర్వహించి, రిజర్వేషన్ల 50 శాతం పరిమితిని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కనీస మద్దతు ధర (MSP), రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ‘కిసాన్ న్యాయ్’ కింద GST రహిత వ్యవసాయానికి చట్టపరమైన హోదాకు పార్టీ హామీ ఇచ్చింది. ‘కార్మిక న్యాయం’ కింద, కార్మికులకు ఆరోగ్యంపై హక్కు కల్పిస్తామని, రోజుకు కనీస వేతనం రూ.400, పట్టణ ఉపాధి హామీని కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాగే ‘నారీ న్యాయం’ కింద ‘మహాలక్ష్మి’ హామీ కింద దేశవ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తానంటూ అనేక వాగ్దానాలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..