కశ్మీర్ పై చైనా వైఖరి మారినట్టేనా ?
వివాదాస్పద కశ్మీర్ విషయంలో చైనా తన వైఖరిని మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ఈ అంశంలో పాకిస్తాన్ ను పూర్తిగా ఏకాకిని చేసినట్టేనని అంటున్నారు. ఇప్పుడిక ఏ దేశమూ పాక్ కు అండగా నిలిచిన దాఖలాల్లేవు. కశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిపై రంకెలేసిన సంగతి తెలిసిందే. ఈ సమస్య ఐరాస నిబంధనావళికి కట్టుబడి ఉందని, ఐరాస తీర్మానాల ప్రకారం దీన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని […]
వివాదాస్పద కశ్మీర్ విషయంలో చైనా తన వైఖరిని మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ఈ అంశంలో పాకిస్తాన్ ను పూర్తిగా ఏకాకిని చేసినట్టేనని అంటున్నారు. ఇప్పుడిక ఏ దేశమూ పాక్ కు అండగా నిలిచిన దాఖలాల్లేవు. కశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిపై రంకెలేసిన సంగతి తెలిసిందే. ఈ సమస్య ఐరాస నిబంధనావళికి కట్టుబడి ఉందని, ఐరాస తీర్మానాల ప్రకారం దీన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని ఇమ్రాన్ అంటూ వచ్చారు. పైగా భారత్ పై అణు యుధ్ధం జరుపుతామని కూడా బీరాలు పలికారు. కానీ చైనా అనుసరించిన ‘ డిప్లొమసీ డోస్ ‘ తో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఈ వివాదాన్ని భారత-పాకిస్థాన్ దేశాలు పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని. ఇది ద్వైపాక్షిక సమస్య అని చైనా స్పష్టం చేసింది. ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఇటీవలే ఈ ప్రకటన చేశారు. పైగా టర్కీ కూడా చైనా అభిప్రాయంతో ఏకీభవించింది . ఐరాస సమావేశాల్లోనే ఆ దేశం తన వైఖరిని వెల్లడించింది. కాగా మూడు రోజుల క్రితమే -చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత పర్యటన ఖరారైన నేపథ్యంలో ఆ దేశం కాశ్మీర్ విషయంలో పునరాలోచనలో పడి… ఇండియాకు అనుకూల ధోరణి పాటించక తప్పలేదు.