AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అతన్ని 20 ఏళ్ల క్రితం చంపేశాను.. ఇప్పుడు కలలోకి వచ్చి హింసిస్తున్నాడు’.. పోలీసుల ఎదుట గగ్గోలు

ఇరవై ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని చంపి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మాయం చేశాడో వ్యక్తి. ఐతే ఇన్నాళ్ల తర్వాత ఓ విచిత్రమైన ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించాడు. తాను చంపేసిన వ్యక్తి తన కలలోకి వచ్చి రోజూ హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. తనను రక్షించండంటూ గగ్గోలు...

'అతన్ని 20 ఏళ్ల క్రితం చంపేశాను.. ఇప్పుడు కలలోకి వచ్చి హింసిస్తున్నాడు'.. పోలీసుల ఎదుట గగ్గోలు
Chhattisgarh Crime
Srilakshmi C
|

Updated on: Apr 21, 2023 | 10:10 AM

Share

ఇరవై ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని చంపి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మాయం చేశాడో వ్యక్తి. ఐతే ఇన్నాళ్ల తర్వాత ఓ విచిత్రమైన ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించాడు. తాను చంపేసిన వ్యక్తి తన కలలోకి వచ్చి రోజూ హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. తనను రక్షించండంటూ గగ్గోలు పెడుతున్నాడు. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బాలోద్‌ జిల్లా కర్కాభాట్‌ గ్రామానికి చెందిన టికం కొలియారా అనే వ్యక్తి 2003లో ఛబేశ్వర్‌ గోయల్‌ అనే వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తాను హత్య చేసిన విషయాన్ని కొలియారా గతేడాది గ్రామస్థులతో చెప్పాడు. అతను తన భార్యకు స్నేహితుడని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో హతమార్చినట్లు తెలిపాడు. తన చేతులతో చంపిన ఛవేశ్వర్‌ ఇప్పుడు తన కలలోకి వచ్చి వేధిస్తున్నాడని గ్రామస్థులతో చెప్పుకొచ్చాడు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కొలియారాను అరెస్టు చేశారు. ఐతే కొలియారా చెప్పిన ఆధారాల ప్రకారం మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలంలో బుధవారం (ఏప్రిల్ 19) తవ్వకాలు చేపట్టగా.. వారికి ఎటువంటి మృతదేహం లభించలేదు. దీంతో కొలియారా మానసిక ఆరోగ్యం బాగాలేదని పోలీసులు అతన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

కానీ ఛవేశ్వర్‌ తండ్రి మాత్రం తన కొడుకు గత కొంతకాలంగా కనిపించడం లేదంటూ, ఆ ప్రాంతంలో మళ్లీ తవ్వకాలు జరపాలంటూ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు బుధవారం మరోసారి తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో డ్యామ్‌ పక్కన కొన్ని ఎముకలు, వస్త్రాలను గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం వాటిని ల్యాబ్‌కు పంపినట్లు ఏఎస్పీ హరీశ్ రాథోడ్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం