AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 72 పెంచిన కేంద్రం.. రైతుల ఆందోళన చల్లారేనా …?

2021-22 పంటల సంవత్సరానికి గాను కేంద్రం వరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు 72 రూపాయలు పెంచింది. ఇప్పటివరకు ఇది క్వింటాలు 1868 రూపాయలుండగా ఇక 1940 రూపాయలకు పెరిగింది. ఇతర ఖరీఫ్ పంటలకు కూడా కనీస మద్దతు...

వరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 72 పెంచిన కేంద్రం.. రైతుల ఆందోళన చల్లారేనా ...?
Centre Increases Mo For Paddy By 72 Rs
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 09, 2021 | 8:26 PM

Share

2021-22 పంటల సంవత్సరానికి గాను కేంద్రం వరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు 72 రూపాయలు పెంచింది. ఇప్పటివరకు ఇది క్వింటాలు 1868 రూపాయలుండగా ఇక 1940 రూపాయలకు పెరిగింది. ఇతర ఖరీఫ్ పంటలకు కూడా కనీస మద్దతు ధరను పెంచినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు.ఖరీఫ్ లో వరి ప్రధాన పంటగా ఉంటోంది. నైరుతిరుతుపవనాలు ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు నాటేందుకు సిద్ధమయ్యారు. జూన్-సెప్టెంబరు మధ్య కాలంలో సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ ఇదివరకే అంచనా వేసింది. అటు కంది-మినపప్పులకు కూడా కనీస మద్దతు ధరను పెంచినట్టు కేంద్రం వెల్లడించింది. వీటికి ఎం ఎస్ పీని 300 రూపాయల మేర పెంచారు. ఇది 5 శాతం పెరుగుదల అని అధికారవర్గాలు పేర్కొన్నాయి. దీనితో క్వింటాలు 6,300 రూపాయలైందనిఈ వర్గాలు పేర్కొన్నాయి. కానీ జొన్న పంటకు మాత్రం క్వింటాలు 20 రూపాయలు మాత్రమే పెరిగింది.ఇప్పుడిది క్వింటాలు 1870 రూపాయలుంది.తమ పంటలకు కనీస మద్దతు ధర పెంచాలంటూ అన్నదాతలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో వివాదాస్పదమైన మూడు చట్టాలను రద్దు చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్..

రైతు సంఘాలతో చర్చలకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని, కానీ ఈ చట్టాల రద్దుపై తాము వారితో మాట్లాడేది లేదని నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. దీనిపై గతంలోనే వారికీ వివరించామన్నారు. ఇలా ఉండగా కేంద్రం కనీస మద్దతు ధర పెంపు ప్రకటనపై రైతు సంఘాలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇవి తమలో తాము సమావేశమై ఈ విషయంలో తమ భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకోనున్నట్టు సమాచారం.

మరిన్ని ఇక్కడ చూడండి: ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది..అన్నం తినలేదు కొట్టాను అంటూ తల్లి కేర్ లెస్ ఆన్సర్ :Viral video.

Pfizer expands vaccine :12 ఏళ్ళ లోపు చిన్నారులకు ఫైజర్ వాక్సిన్..చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ పార్రంభం..?(వీడియో)

 చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల మూడు రోజులుగా.తంటాలు పడుతున్న పిల్ల కోతి..వైరల్ అవుతున్న వీడియో :Monkey Viral Video.

ఆనందయ్య ఆవేదన..!ఆనందయ్య మందు పంపిణీలో గందరగోళం..అయన శిష్యులు ఎంత మంది ? :Anandaiah Corona Medicine video.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?