Corona Alert: కరోనా ప్రమాదం ముంచుకొస్తోంది.. జాగ్రత్త..! తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్‌..

|

Mar 16, 2023 | 8:01 PM

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వికి లేఖ రాసింది. గత రెండు వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది.

Corona Alert: కరోనా ప్రమాదం ముంచుకొస్తోంది.. జాగ్రత్త..! తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్‌..
Corona Virus
Follow us on

కరోనావైరస్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి హైఅలర్ట్‌ జారీ చేసింది. ఆరు రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. గుజరాత్, మహారాష్ట్ర , తెలంగాణ , కర్నాటక , కేరళ ప్రభుత్వాలకు లేఖ రాసింది. టెస్టింగ్‌ ,ట్రీట్‌మెంట్‌ , ట్రాకింగ్‌ , వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. ఓవైపు ఫ్లూజ్వరాలు విజృంభిస్తున్న వేళ.. కేంద్రం కరోనా అలర్ట్‌ జారీ చేయడంతో మళ్లీ మహమ్మారి వేవ్‌ తప్పదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజలు మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలని చెబుతోంది ఐసీఎంఆర్‌. ఈ నేపథ్యంలో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖను రాసింది.

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వికి లేఖ రాసింది. గత రెండు వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఈ నెల 8 వ తేదీ నాటికి కేవలం 132 ఉన్న కోవిడ్ కేసులు.. 15వ తేదీ నాటికి 267కి చేరడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. మరి ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా కేసులు వెలుగు చూస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నియంత్రణకు జిల్లా స్థాయినుంచి కార్యాచరణ ప్రారంభించాలని కేంద్రం సూచించింది. ముఖ్యంగా ఎక్కడికక్కడ టెస్ట్ లు చేయడంతో పాటు.. కాంటాక్ట్ లను ట్రేస్ చేయడం, బాధితులకు చికిత్స అందించాలని కోరింది. కోవిడ్ నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ని అమలు చేయాలని ఆదేశించింది.

దేశంలోనూ గత కొన్ని వారాలుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న ఆరోగ్య శాఖ.. మార్చ్ 8 నాటికి దేశ వ్యాప్తంగా 2082 కోవిడ్ కేసులు ఉండగా… ఈ నెల 15 నాటికి ఆ సంఖ్య 3264 కి పెరిగిందని స్పష్టం చేసింది. తెలంగాణ సహా కేస్ లు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాలు తప్పక టెస్ట్ ల నిర్వహణ, కొత్త కేస్ లు ఎక్కువగా వస్తున్న క్లస్టర్స్ ని మానిటర్ చేయడం, విదేశాల నుంచి వస్తున్న వారి శాంపిల్లను జీనోమ్ సీక్వెన్స్ కి పంపడం సహా.. ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరింది.డెడికేటెడ్ ఫీవర్ క్లినిక్ లను ఏర్పాటు చేసి రోగుల ముందస్తు లక్షణాలను గుర్తించాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..