AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీలకమైన అధికారాలను రాష్ట్రాలకు అప్పగించనున్న కేంద్రం.. క్యాబినెట్ నిర్ణయంతో రాష్ట్రాల హర్షం

అత్యంత కీలకమైన అధికారాలను తిరిగి రాష్ట్రాలకు అప్పగించేందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు సమాచారం. ఓబీసీ జాబితాలో..

కీలకమైన అధికారాలను రాష్ట్రాలకు అప్పగించనున్న కేంద్రం.. క్యాబినెట్ నిర్ణయంతో రాష్ట్రాల హర్షం
Javeed Basha Tappal
|

Updated on: Aug 05, 2021 | 9:57 AM

Share

అత్యంత కీలకమైన అధికారాలను తిరిగి రాష్ట్రాలకు అప్పగించేందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు సమాచారం. ఓబీసీ జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన పూర్తి హక్కులను రాష్ట్రాలకే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారాల తిరిగి అప్పగింతకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. విద్య సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో సామాజికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారిని ఓబీసీ జాబితాలో చేర్చే హక్కు రాష్ట్రాలకు లేదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జాబితాలో మార్పలు చేసే అధికారం పార్లెంటుకు మాత్రమే ఉందంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ మరాఠాలకు కోటా ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. దీంతో ఓబీసీ జాబితాలో మార్పులు, చేర్పులు చేసే అధికారం రాష్ట్రాలకే అప్పగించే బిల్లుకు కేంద్ర క్యాబినెట్ అంగీకరించినట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును సభ ముందు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. 389 పోక్సో కోర్టులతోపాటు దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్ ట్రాక్ సె్పషల్ కోర్టులను మరో 2 ఏళ్లపాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..