AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిహద్దు దాటి భారత భూభాగంలోకి.. భద్రతా దళాలకు చిక్కిన పాకిస్థాన్ రేంజర్..!

పంటికి పంటి. కంటికి కన్ను.. పాకిస్తాన్‌కు భారతదేశం ఇచ్చే అత్యుత్తమ సమాధానం ఇదే. ఈసారి భారత సైన్యం వరుసలోకి వస్తుంది. ఎందుకంటే, BSF పాక్ రేంజర్‌ను పట్టుకుంది. శనివారం(మే 3) రాజస్థాన్‌లోని ఫోర్ట్ అబ్బాస్ వద్ద భారత సరిహద్దు గార్డులు భారత దేశంలో అడుగుపెట్టిన పొరుగు దేశానికి చెందిన సైనికుడిని అదుపులోకి తీసుకున్నారు.

సరిహద్దు దాటి భారత భూభాగంలోకి.. భద్రతా దళాలకు చిక్కిన పాకిస్థాన్ రేంజర్..!
Army
Balaraju Goud
|

Updated on: May 03, 2025 | 8:52 PM

Share

పంటికి పంటి. కంటికి కన్ను.. పాకిస్తాన్‌కు భారతదేశం ఇచ్చే అత్యుత్తమ సమాధానం ఇదే. ఈసారి భారత సైన్యం వరుసలోకి వస్తుంది. ఎందుకంటే, BSF పాక్ రేంజర్‌ను పట్టుకుంది. శనివారం(మే 3) రాజస్థాన్‌లోని ఫోర్ట్ అబ్బాస్ వద్ద భారత సరిహద్దు గార్డులు భారత దేశంలో అడుగుపెట్టిన పొరుగు దేశానికి చెందిన సైనికుడిని అదుపులోకి తీసుకున్నారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. మరోవైపు, రెండు దేశాలు శాంతిని కాపాడుకోవాలని పలు దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మునీర్‌ను ఎన్ఎస్ఏగా నియమించింది. అదే సమయంలో, భారతదేశం పాకిస్తాన్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలను తగ్గించుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంతో పాటు నిలుస్తామని, ప్రధాని మోదీకి పూర్తి మద్దతు ఉంటుందని ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి.

బిఎస్ఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ తరుణంలో పాకిస్తాన్ రేంజర్ తెలిసి కూడా సరిహద్దు దాటి భారతదేశంలోకి ప్రవేశించాడు. అంతేకాదు తన నోటికి పని చెప్పాడు. పైగా బెదిరించాడు. పొరుగు దేశానికి చెందిన సైనికుడు భారత సరిహద్దు గార్డులను, పోలీసులను చూడగానే వారిని దుర్భాషలాడటం ప్రారంభించాడు. భారత సైనికులు వెంటనే అతన్ని పట్టుకుని అరెస్టు చేశారు.

పాక్ సైనికుడిని భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలియగానే పాకిస్తాన్‌లో అలజడి చెలరేగడం గమనించదగ్గ విషయం. పొరుగు దేశం రేంజర్‌ను విడిపించడానికి పరుగులు పెడుతోంది. సరిహద్దు గార్డుల ఫ్లాగ్ మీటింగ్ జరుపుతామంటూ పట్టుబడుతోంది. అక్కడ పాక్ రేంజర్లు పాక్ సైనికులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ బిఎస్ఎఫ్ దానిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. దీని కారణంగా ఆ సైనికుడు ప్రస్తుతం భారతదేశంలో చిక్కుకుపోయాడు.

యాదృచ్ఛికంగా, పాకిస్తాన్ ఏడు రోజుల క్రితం బెంగాలీ సైనికుడు పూర్ణమ్ సాహును ఇదే విధంగా అరెస్టు చేసింది. పహల్గామ్ సంఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకున్న సమయంలో, పొరపాటున పొరుగు దేశం సరిహద్దులోకి ప్రవేశించినందుకు పూర్ణమ్‌ను అరెస్టు చేశారు. ఫ్లాగ్ మీటింగ్ జరిగినప్పటికీ, పాకిస్తాన్ ఇంకా అతన్ని విడుదల చేయలేదు. ఈ పరిస్థితి సైనికుడి ఇంట్లో ఆందోళనకరంగా ఉంది. అతను ఎలా ఉన్నాడో, ఏమి తింటున్నాడో అని కుటుంబం ఆందోళన చెందుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us