Israel Embassy: దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్‌ కలకలం.. ఇజ్రాయెల్ ఎంబసీ వెనుక పేలుడు

అగ్నిమాపక, ఇతర భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం హై సెక్యూరిటీ జోన్‌లో ఉంది. రాయబార కార్యాలయానికి సంబంధించిన పరిసర ప్రాంతాలను పోలీసులు చుట్టుముట్టారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.. అయితే సరిగ్గా ఏమి జరిగిందో ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. ఏది ఏమైనప్పటికీ, హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుండి ఎంబసీ చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు  చేశారు.

Israel Embassy: దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్‌ కలకలం.. ఇజ్రాయెల్ ఎంబసీ వెనుక పేలుడు
Israel Embassy
Follow us

|

Updated on: Dec 26, 2023 | 9:12 PM

ఢిల్లీ లోని ఇజ్రాయెల్‌ ఎంబసీ కార్యాలయం దగ్గర పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఎంబసీ వెనుక ఖాళీ ప్రాంతంలో పేలుడు శబ్ధం విన్పించింది. వెంటనే అప్రమత్తమైన ఎంబసీ సిబ్బంది పోలీసులకు సమాచారమందించారు. రాజధానిలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక పేలుడు సంభవించిందని మంగళవారం అగ్నిమాపక దళ విభాగానికి ఒక వ్యక్తి ఫోన్ చేయడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ దర్యాప్తు ప్రారంభించింది. పేలుడు ప్రదేశాన్ని పరిశీలించారు పోలీసులు. అక్కడికి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు వ్లెలడించారు.

ప్రస్తుతం పేలుడు జరిగినట్టుగా వచ్చిన ఫోన్‌ కాల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు అధికారులు. కాల్‌ చేసింది ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేశారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంటోందని సమాచారం. దీంతో పాటు సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా మరింత అలర్ట్‌ అయ్యాయి. అగ్నిమాపక, ఇతర భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం హై సెక్యూరిటీ జోన్‌లో ఉంది. రాయబార కార్యాలయానికి సంబంధించిన పరిసర ప్రాంతాలను పోలీసులు చుట్టుముట్టారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.. అయితే సరిగ్గా ఏమి జరిగిందో ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. ఏది ఏమైనప్పటికీ, హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుండి ఎంబసీ చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు  చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, రెండేళ్ల క్రితం కూడా ఇదే ప్రాంతంలో పేలుడు జరిగింది. జనవరి 29, 2021 సాయంత్రం ఢిల్లీలోని ఎంబసీ సమీపంలో పేలుడు సంభవించింది. బాంబు పేలుడుతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ పేలుడు ధాటికి చాలా కార్లు దెబ్బతిన్నాయి. ఆ రోజు  మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
పూరన్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన లక్నో.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
పూరన్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన లక్నో.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఆసీస్ బీచుల్లో రష్మిక ఫొటో షూట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
ఆసీస్ బీచుల్లో రష్మిక ఫొటో షూట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
రసాయనాలు లేకుండా రెండ్రోజుల్లోనే పచ్చి అరటిగెల పండింది..?!ఎలాగంటే
రసాయనాలు లేకుండా రెండ్రోజుల్లోనే పచ్చి అరటిగెల పండింది..?!ఎలాగంటే
బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. ఊహించని పాత్రలో అనన్య..
బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. ఊహించని పాత్రలో అనన్య..
ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్..
ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్..
లక్నో ఓనర్ ఇంట్లో కేఎల్ రాహుల్‌ డిన్నర్.. అతియా శెట్టి ఏమందంటే?
లక్నో ఓనర్ ఇంట్లో కేఎల్ రాహుల్‌ డిన్నర్.. అతియా శెట్టి ఏమందంటే?
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..?లాభాలు తెలిస్తేఆశ్చర్యపోతారు
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..?లాభాలు తెలిస్తేఆశ్చర్యపోతారు