AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగోసారి.. సీఎం పీఠమెక్కిన చౌహాన్..

ఎన్నో మలుపులు తిరిగి.. చివరకు మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం సోమవారంతో ముగిసింది. బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మధ్యప్రదేశ్‌ సీఎంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌ రాత్రి 9.00 గంటలకు చౌహాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో నాలుగు సార్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటుగా.. మాజీ సీఎం కమల్‌నాథ్‌ కూడా హాజరయ్యారు. […]

నాలుగోసారి.. సీఎం పీఠమెక్కిన చౌహాన్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 24, 2020 | 7:26 AM

Share

ఎన్నో మలుపులు తిరిగి.. చివరకు మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం సోమవారంతో ముగిసింది. బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మధ్యప్రదేశ్‌ సీఎంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌ రాత్రి 9.00 గంటలకు చౌహాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో నాలుగు సార్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటుగా.. మాజీ సీఎం కమల్‌నాథ్‌ కూడా హాజరయ్యారు.

కాగా.. అంతకుముందు.. సోమవారం సాయంత్రం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చౌహాన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయడంతో.. కొత్త మంత్రి వర్గాన్ని వచ్చే వారంలో విస్తరించే అవకాశం ఉంది.

మరోవైపు కేబినెట్ విస్తరణలో.. జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి పెద్ద పీఠ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన..తన వెంట 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెచ్చుకున్నారు. సింధియా బీజేపీలో చేరిన అనంతరం.. ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో కమల్ నాథ్‌ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ప్రస్తుతం 107 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. పార్టీ బలం 92 మందికి పడిపోయింది. దీంతో సభ బలం 206కు తగ్గి.. మెజార్టీ 104కి పడిపోయింది. అయితే అప్పటికే బీజేపీకి 107 ఉండటంతో.. ఇతర పార్టీల మద్దతు లేకుండానే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Follow Us
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే
పిల్లల భవిష్యత్తు మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందని తెలుసా
పిల్లల భవిష్యత్తు మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందని తెలుసా