బీజేపీ గెలుపు హిస్టరీ కాదు.. అదో మిస్టరీ

కేంద్రప్రభుత్వంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కానీ.. అది హిస్టరీ ఏం కాదని.. అదో మిస్టరీ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ గెలుపు వెనుక అధికార బలం, డబ్బు, పోలీస్, ఈవీఎంలు పని చేశాయన్నారు. తమ రాష్ట్రంలోకి చొరబడి గొడవలు సృష్టించారని ఆరోపించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ డ్రామాలు పని చేయవన్నారు. తమ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని తెలిపారు. […]

బీజేపీ గెలుపు హిస్టరీ కాదు.. అదో మిస్టరీ
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2019 | 1:07 PM

కేంద్రప్రభుత్వంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కానీ.. అది హిస్టరీ ఏం కాదని.. అదో మిస్టరీ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ గెలుపు వెనుక అధికార బలం, డబ్బు, పోలీస్, ఈవీఎంలు పని చేశాయన్నారు. తమ రాష్ట్రంలోకి చొరబడి గొడవలు సృష్టించారని ఆరోపించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ డ్రామాలు పని చేయవన్నారు. తమ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని తెలిపారు. అదే పని తాము చేస్తే.. కమలనాథులు తట్టుకోగలరా.. అంటూ ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదని మమతా విమర్శించారు.