Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్రకు సర్వం సిద్ధం.. తమది ‘మన్ కీ బాత్’ కాదన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్

వచ్చే స్వార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆపార్టీ యువనేత రాహుల్ గాంధీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. దేశం మొత్తం తిరిగి ప్రజలకు పార్టీని మరింత చేరవచేసేందుకు ఆయన ఈసుదీర్థ పాదయాత్రకు..

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్రకు సర్వం సిద్ధం.. తమది 'మన్ కీ బాత్' కాదన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్
Jairam Ramesh
Follow us

|

Updated on: Sep 05, 2022 | 9:46 PM

Bharat Jodo Yatra: వచ్చే స్వార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆపార్టీ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. దేశం మొత్తం తిరిగి ప్రజలకు పార్టీని మరింత చేరవచేసేందుకు ఆయన భారత్ జోడో (Bharat Jodo)  పేరుతో సుదీర్థ పాదయాత్రకు సెప్టెంబర్ 7వ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఈయాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా యాత్ర గీతాన్ని ఆ పార్టీ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా జోడో యాత్ర ఉద్దేశాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ఢిల్లీలోని కాగ్రెస్ పార్టీ ప్రధానకార్యాలయంలో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమంపై తీవ్ర విమర్శలు చేశారు. మన్‌కీ బాత్‌లా తమది వన్‌వే ప్రోగ్రామ్‌ కాదని.. ప్రజల గోడు వినే యాత్ర అని పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్రలో సుదీర్ఘ ప్రసంగాలు, ప్రభోదాలు, డ్రామాలు, టెలీప్రాంప్టర్లు ఉండవని. మన్ కీ బాత్ లా వన్ వే ప్రోగ్రాం కాదని ఎద్దేవా చేశారు. ప్రజల గోడు విని వారి డిమాండ్లను దిల్లీకి చేర్చడమే ఈ యాత్ర ఉద్దేశమని పేర్కొన్నారు. ‘మీదో అడుగు, మాదో అడుగుతో దేశాన్ని కలుపుదాం’ అనే నినాదంతో యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశం విభజనకు గురౌతోందన్న కారణంతో భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా దేశం విడిపోతోందని, రాష్ట్రాల హక్కులు హరించుకుపోతున్నాయని.. అందుకే ఆ యాత్ర చేపడుతున్నామన్నారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగే ఈ యాత్రలో రాహుల్‌ సహా మరికొంతమంది భారత్‌యాత్రీలు ఉంటారని చెప్పారు. ఈ యాత్రను పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్‌స్ట్రీమ్‌ చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 7న ప్రారంభమయ్యే ఈ యాత్రలో భాగంగా తొలుత రాహుల్‌ గాంధీ తన తండ్రి రాజీవ్‌ గాంధీకి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. కన్యాకుమారిలోని శ్రీపెరంబదూర్‌లో జరిగే ఈ కార్యక్రమంలో తమిళనాడు, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు స్టాలిన్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ బఘేల్‌ పాల్గొంటారని తెలిపారు. అనంతరం మహాత్మగాంధీ మండపానికి వెళతారని, అక్కడి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. వాస్తవానికి ఏడో తేదీన ప్రారంభమైనప్పటికీ 8వ తేదీ నుంచి పాదయాత్ర మొదలవుతుందన్నారు. రోజూ రెండు భాగాలుగా ఈ యాత్ర కొనసాగుతుందని, ఉదయం 7 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పాదయాత్ర నిర్వహిస్తారని చెప్పారు. రోజూ సగటున 22 నుంచి 23 కిలోమీటర్ల చొప్పున మొత్తం 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని జైరామ్‌ రమేశ్‌ వివరించారు. ప్రధాన యాత్రకు అనుబంధంగా ఆయా రాష్ట్రాల్లో చిన్న జోడో యాత్రలు నిర్వహిస్తారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు
ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు
పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం
పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం
ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..
ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!