ప్రభుత్వ కార్యాలయాల్లో డ్రెస్ కోడ్.. జీన్స్, టీ-షర్టులపై నిషేధం.. సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు..!
హిమాచల్ ప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై డ్రెస్ కోడ్ అమలు చేయనున్నారు. ఈ నియమావళి ప్రకారం, ఉద్యోగులు జీన్స్, టీ-షర్టులు లేదా చిరిగిన బట్టలు ధరించి కార్యాలయానికి రావడానికి అనుమతి లేదు. ఈ డ్రెస్ కోడ్ పురుష, మహిళా ఉద్యోగులు ఇద్దరికీ వర్తిస్తుంది. ఉద్యోగులు ఇకపై కార్యాలయానికి శుభ్రమైన, హుందాగా ఉండే, ఫార్మల్ దుస్తులు ధరించి రావాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై డ్రెస్ కోడ్ అమలు చేయనున్నారు. ఈ నియమావళి ప్రకారం, ఉద్యోగులు జీన్స్, టీ-షర్టులు లేదా చిరిగిన బట్టలు ధరించి కార్యాలయానికి రావడానికి అనుమతి లేదు. ఈ డ్రెస్ కోడ్ పురుష, మహిళా ఉద్యోగులు ఇద్దరికీ వర్తిస్తుంది. ఉద్యోగులు ఇకపై కార్యాలయానికి శుభ్రమైన, హుందాగా ఉండే, ఫార్మల్ దుస్తులు ధరించి రావాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, సోషల్ మీడియా వాడకంపై కూడా కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నిర్ణయం కార్యాలయంలో క్రమశిక్షణను, వృత్తిపరమైన వాతావరణాన్ని కాపాడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్, సోషల్ మీడియా వాడకానికి సంబంధించి కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. పర్సనల్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఉత్తర్వులో, ప్రభుత్వ ఉద్యోగులందరూ మంచి, శుభ్రమైన, ఫార్మల్ దుస్తులలో కార్యాలయానికి హాజరు కావాలని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, పురుష ఉద్యోగులు చొక్కాలు, ప్యాంటులు లేదా ట్రౌజర్లు, కాలర్ ఉన్న చొక్కాలు, బూట్లు లేదా చెప్పులు ధరించాలి. మహిళా ఉద్యోగులకు ప్రామాణిక దుస్తుల నియమావళి చీర, ఫార్మల్ సూట్, సల్వార్,చుడీదార్, కుర్తా-దుపట్టా, లేదా ట్రౌజర్-షర్ట్ ధరించాలి. కార్యాలయంలో జీన్స్, టీ-షర్టులు ధరించడంపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇది కార్యాలయంలో మర్యాద, క్రమశిక్షణ, వృత్తిపరమైన వాతావరణాన్ని కాపాడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగులు వ్యక్తిగత పరిశుభ్రత, అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా కోరారు.
ఈ ఉత్తర్వు సోషల్ మీడియాకు సంబంధించి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఉద్యోగులు తమ వ్యక్తిగత ఖాతాల నుండి ప్రభుత్వ విధానాలపై అనధికారిక వ్యాఖ్యలు చేయడానికి వీలు లేదని ఆంక్షలు విధించారు. ఉద్యోగులు ప్రభుత్వాన్ని విమర్శించే లేదా దాని ప్రతిష్టను దెబ్బతీసే ఎలాంటి ప్రకటనలు, పోస్టులు పెట్టకూడదు. సోషల్ మీడియాలో అధికారిక పత్రాలను పంచుకోవడం కూడా నిబంధనలకు విరుద్ధంగా పరిగణిస్తామని సర్కార్ వెల్లడించింది. అలా చేసినట్లు రుజువైన ఏ ఉద్యోగి అయినా చర్యను ఎదుర్కోవలసి రావచ్చని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో అనుచిత ప్రవర్తన లేదా బాధ్యతారహిత కార్యకలాపాలను సేవా ప్రవర్తనా నియమాల ప్రకారం క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తారని, దాని ఫలితంగా సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం తన ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వు అన్ని విభాగాలు, అధికార సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, విశ్వవిద్యాలయాల ఉద్యోగులకు వర్తిస్తుందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
