Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal: విచారణకు హాజరుకాలేను..ఈడీకి కేజ్రీవాల్ లేఖ.. ముందస్తు ప్రణాళికలో భాగంగా మధ్యప్రదేశ్‌కు

Delhi Liquor Scam: సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇచ్చింది. గతేడాది ఇదే అంశంపై కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు ఇచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ ఏప్రిల్‌ 16న 9 గంటలపాటు ప్రశ్నించింది.ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. అయితే కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లపై ఆప్‌ మండిపడుతోంది. తమ పార్టీని ఎలాగైనా అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

Arvind Kejriwal: విచారణకు హాజరుకాలేను..ఈడీకి కేజ్రీవాల్ లేఖ.. ముందస్తు ప్రణాళికలో భాగంగా మధ్యప్రదేశ్‌కు
Aravind Kejriwal
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 02, 2023 | 11:47 AM

ఢిల్లీ, నవంబర్ 02: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇచ్చింది. గతేడాది ఇదే అంశంపై కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు ఇచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ ఏప్రిల్‌ 16న 9 గంటలపాటు ప్రశ్నించింది.ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. అయితే కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లపై ఆప్‌ మండిపడుతోంది. తమ పార్టీని ఎలాగైనా అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం (నవంబర్ 2) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు సమన్లు ​​పంపింది. ఇడి ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ముందు.. కేజ్రీవాల్ ప్రశ్నించడానికి పంపిన నోటీసు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు. బీజేపీ సూచన మేరకే నోటీసులు పంపినట్లు మండిపడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో తాను ప్రచారం చేయాల్సి ఉన్నందున.. వెంటనే నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు.

అయితే ఈరోజు ఆయన ఈడీ ఎదుట హాజరుకావడం లేదు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లడమే ఇందుకు కారణం. అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. కొంతకాలం తర్వాత, కేజ్రీవాల్ మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీకి బయలుదేరుతారు. దీంతో కేజ్రీవాల్వి చారణ కోసం ఈడీ కార్యాలయానికి వెళ్లడం లేదన్నారు.

ఏజెన్సీ ఏమి చేయగలవు..?

  • ఈడీ తాజాగా కేజ్రీవాల్‌కు సమన్లు ​​జారీ చేసింది.
  • ఒక వ్యక్తి మూడు సార్లు ED సమన్లను విస్మరించవచ్చు.
  • ఆ తర్వాత, ఏజెన్సీ నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) కోరవచ్చు.
  • NBW అనేది ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట సమయం, తేదీలో కోర్టుకు హాజరు కావాల్సిన కోర్టు ఉత్తర్వు.
  • ఒక వ్యక్తి NBWని విస్మరిస్తే, వారిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచవచ్చు.

కేజ్రీవాల్ ఏం చేస్తారంటే..?

  • సమన్లను సవాలు చేసేందుకు కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించవచ్చు.
  • ముందస్తు బెయిల్ కూడా కోరవచ్చు.

ఈడీకి లేఖ రాసి సమాధానం ఇచ్చారు

అయితే కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి వెళ్లలేదు. అయితే ఈ నోటీసుపై ఆయన లేఖ ద్వారా స్పందించారు. మీరు నన్ను ఏ హోదాలో సాక్షిగా లేదా అనుమానితుడిగా పంపారో స్పష్టంగా తెలియదని కేజ్రీవాల్ రాశారు. సమన్లలో కూడా నాకు వివరాలు ఇవ్వలేదు. నన్ను వ్యక్తిగతంగా పిలిచారా లేదా ముఖ్యమంత్రిగా లేదా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌గా పిలిచారా అనేది కూడా చెప్పలేదని కేజ్రీవాల్ లేఖలో రాశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి