Sanjay Raut: అమ్మను ఆలింగనం చేసుకుని.. పాదాలకు నమస్కరించి.. అరెస్టుకు ముందు భావోద్వేగ దృశ్యాలు
పత్రాచల్ కుంభకోణం కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut).. అరెస్టు కాకముందు కుటుంబసభ్యులతో గడిపిన తీరు భావోద్వేగానికి గురి చేస్తోంది. ఈడీ అధికారులు అరెస్టు చేయకముందు ఆయన తన తల్లి, కూతురిని హత్తుకుని కన్నీరు పెట్టారు....
పత్రాచల్ కుంభకోణం కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut).. అరెస్టు కాకముందు కుటుంబసభ్యులతో గడిపిన తీరు భావోద్వేగానికి గురి చేస్తోంది. ఈడీ అధికారులు అరెస్టు చేయకముందు ఆయన తన తల్లి, కూతురిని హత్తుకుని కన్నీరు పెట్టారు. అంతే కాకుండా వారికి జాగ్రత్తలు చెప్పారు. అనంతరం సంజయ్ రౌత్ బయటకు వెళ్తుండగా రౌత్ తల్లి హారతి ఇచ్చి తిలకం దిద్దారు. ఆయనమో తల్లి పాదాలకు నమస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా.. పత్రాచల్ ల్యాండ్ స్కాం కేసులో ఈడీ అధికారులు సంజయ్ రౌత్ ను నిన్న (ఆదివారం) అరెస్టు చేశారు. అనంతరం ముంబైలోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనను ఇవాళ ( సోమవారం ) కోర్టు ముందు హాజరుపరుస్తామని వెల్లడించారు. అయితే.. రూ.1,034 కోట్లు పత్రాచాల్ భూ కుంభకోణంలో ఇప్పటికే ఈడీ అనేక సార్లు సంజయ్ రౌత్కు నోటీసులు పంపింది. జూన్ 28న మొదటిసారి సమన్లు జారీ చేయగా.. ఒకసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే తాజాగా ఇచ్చిన సమన్లను సంజయ్ రౌత్ పట్టించుకోలేదు. పార్లమెంట్ సమావేశాలను కారణంగా చూపి, ఆయన విచారణకు వెళ్లలేదు. ఈ సమయంలోనే ఆయన అరెస్టు అవడం మహారాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది.
#SanjayRaut hugs mother before leaving for #ED office. pic.twitter.com/aai80zb2B7
ఇవి కూడా చదవండి— Viraj B. (@VirajB1) July 31, 2022
మరోవైపు.. మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా, ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అవడం చకచకా జరిగిపోయాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్రౌత్ అరెస్టు అవడం హాట్ టాపిక్ గా మారింది. తమ పోరాటాన్ని ఆపేందుకు కుట్ర జరుగుతోందని, బీజేపీ చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారి సమన్లు అందించిందని మద్దతు దారులు తీవ్రంగా స్పందించారు.
ఆదివారం చేసిన సోదాల్లో సంజయ్ రౌత్ ఇంట్లో అధికారులు రూ.11.50 లక్షలు సీజ్ చేశారు. అందులో రూ.10 లక్షలను ప్రత్యేకంగా ఒక కవర్లో ఉంచినట్లు గుర్తించారు. ఆ కవర్పై ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పేరు రాసి ఉంచినట్లు సమాచారం. కాగా ఇవాళ (సోమవారం) సంజయ్ రౌత్ పీఎంఎల్ఏ కోర్టుకు తీసుకెళ్లనున్నారు. అంతేకాకుండా ఈ కేసు విచారణ కోసం ఈడీ సంజయ్ ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని అడగనుంది. సంజయ్ రౌత్ అరెస్టును ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తాము సంజయ్ పక్షానే ఉంటామని స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి