AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polavaram: పోలవరాన్ని సందర్శించిన సీడబ్ల్యూసీ.. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ముప్పు..!

గోదావరి వరదల తర్వాత పోలవరం (Polavaram) ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా CWC పరిశీలించింది. అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌తో పాటు ప్రాజెక్ట్‌ ప్రజెంట్‌ సిట్యువేషన్‌ ఎలాగుందో చెక్‌ చేశారు. వందేళ్ల జులై నెల రికార్డును ఈ ఏడాది వచ్చిన వరదలు చెరిపేసిన విషయం...

Polavaram: పోలవరాన్ని సందర్శించిన సీడబ్ల్యూసీ.. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ముప్పు..!
Polavaram
Ganesh Mudavath
|

Updated on: Aug 01, 2022 | 10:51 AM

Share

గోదావరి వరదల తర్వాత పోలవరం (Polavaram) ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా CWC పరిశీలించింది. అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌తో పాటు ప్రాజెక్ట్‌ ప్రజెంట్‌ సిట్యువేషన్‌ ఎలాగుందో చెక్‌ చేశారు. వందేళ్ల జులై నెల రికార్డును ఈ ఏడాది వచ్చిన వరదలు చెరిపేసిన విషయం తెలిసిందే. దీంతో వరదల తర్వాత ప్రాజెక్టును సీడబ్ల్యూసీ బృందం తనిఖీ చేసింది. సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం మహ్మద్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ప్రాజెక్టు స్థితిగతులపై అధ్యయనం చేశారు. ప్రజెంట్‌ సిట్యువేషన్‌, జరుగుతోన్న పనుల గురించి ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ అధికారుల నుంచి ఇన్‌పుట్‌ తీసుకున్నారు. ఊహించనిస్థాయిలో గోదావరి (Godavari) కి వరదలు పోటెత్తడం, అనేక ప్రాంతాలు నీట మునగడంతో పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై విమర్శలు చెలరేగాయి. పోలవరం బ్యాక్‌ వాటర్‌పై తెలంగాణ నుంచి అనేక అభ్యంతరాలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు కారణంగానే టెంపుల్‌ టౌన్ భద్రాచలం మునిగిపోయిందన్న తెలంగాణ ఈఎన్సీ లేఖపైనా సీడబ్ల్యూసీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. బ్యాక్‌ వాటర్ ఎఫెక్ట్‌పై ఇండిపెండెంట్‌ సంస్థతో స్టడీ చేయించాలని కోరుతోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక ఇప్పుడొచ్చిన వరదలే మళ్లీ వస్తే.. భద్రాచలం పూర్తిగా నీట మునిగిపోవడం ఖాయమని తెలంగాణ ఆందోళ వ్యక్తం చేస్తోంది.

కాగా.. పోలవరం డ్యాం నిర్మాణంపై ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌పై అధ్యయనం చేయాలని కోరింది. పోలవరం నిర్మాణం పూర్తయితే వెనుక జలాలతో భద్రాచలం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేస్తే ఏటా భద్రాచలానికి ముప్పేనని లేఖలో తెలిపింది. ఫలితంగా పోలవరం బ్యాక్‌ వాటర్‌పై అధ్యయనం చేయించాలని కోరింది.

మరోవైపు.. చరిత్రలో కనివీని ఎరుగని రీతిలో ఈ ఏడాది జూలైలో గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. ఒకానొక దశలో వరద 70 అడుగులు దాటింది. భద్రాచలం రామాలయం చెంతకు నీరు చేరింది. పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. భద్రాచలం దగ్గర గోదారిలో 31 అడుగుల నీటిమట్టం దాటితే పర్ణశాల మునిగిపోతుంది. ఇప్పుడు పోలవరం పూర్తైతే ఎప్పుడూ భద్రాచలం వద్ద 43 అడుగుల నీటి మట్టం ఉంటుంది. అదే జరిగితే పర్ణశాల ప్రాంతం జలగర్భంలోకి వెళ్లిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దావోస్‌లో ఏపీకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. లక్ష ఉద్యోగాలు
దావోస్‌లో ఏపీకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. లక్ష ఉద్యోగాలు
'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!