AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polavaram: పోలవరాన్ని సందర్శించిన సీడబ్ల్యూసీ.. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ముప్పు..!

గోదావరి వరదల తర్వాత పోలవరం (Polavaram) ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా CWC పరిశీలించింది. అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌తో పాటు ప్రాజెక్ట్‌ ప్రజెంట్‌ సిట్యువేషన్‌ ఎలాగుందో చెక్‌ చేశారు. వందేళ్ల జులై నెల రికార్డును ఈ ఏడాది వచ్చిన వరదలు చెరిపేసిన విషయం...

Polavaram: పోలవరాన్ని సందర్శించిన సీడబ్ల్యూసీ.. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ముప్పు..!
Polavaram
Ganesh Mudavath
|

Updated on: Aug 01, 2022 | 10:51 AM

Share

గోదావరి వరదల తర్వాత పోలవరం (Polavaram) ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా CWC పరిశీలించింది. అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌తో పాటు ప్రాజెక్ట్‌ ప్రజెంట్‌ సిట్యువేషన్‌ ఎలాగుందో చెక్‌ చేశారు. వందేళ్ల జులై నెల రికార్డును ఈ ఏడాది వచ్చిన వరదలు చెరిపేసిన విషయం తెలిసిందే. దీంతో వరదల తర్వాత ప్రాజెక్టును సీడబ్ల్యూసీ బృందం తనిఖీ చేసింది. సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం మహ్మద్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ప్రాజెక్టు స్థితిగతులపై అధ్యయనం చేశారు. ప్రజెంట్‌ సిట్యువేషన్‌, జరుగుతోన్న పనుల గురించి ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ అధికారుల నుంచి ఇన్‌పుట్‌ తీసుకున్నారు. ఊహించనిస్థాయిలో గోదావరి (Godavari) కి వరదలు పోటెత్తడం, అనేక ప్రాంతాలు నీట మునగడంతో పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై విమర్శలు చెలరేగాయి. పోలవరం బ్యాక్‌ వాటర్‌పై తెలంగాణ నుంచి అనేక అభ్యంతరాలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు కారణంగానే టెంపుల్‌ టౌన్ భద్రాచలం మునిగిపోయిందన్న తెలంగాణ ఈఎన్సీ లేఖపైనా సీడబ్ల్యూసీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. బ్యాక్‌ వాటర్ ఎఫెక్ట్‌పై ఇండిపెండెంట్‌ సంస్థతో స్టడీ చేయించాలని కోరుతోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక ఇప్పుడొచ్చిన వరదలే మళ్లీ వస్తే.. భద్రాచలం పూర్తిగా నీట మునిగిపోవడం ఖాయమని తెలంగాణ ఆందోళ వ్యక్తం చేస్తోంది.

కాగా.. పోలవరం డ్యాం నిర్మాణంపై ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌పై అధ్యయనం చేయాలని కోరింది. పోలవరం నిర్మాణం పూర్తయితే వెనుక జలాలతో భద్రాచలం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేస్తే ఏటా భద్రాచలానికి ముప్పేనని లేఖలో తెలిపింది. ఫలితంగా పోలవరం బ్యాక్‌ వాటర్‌పై అధ్యయనం చేయించాలని కోరింది.

మరోవైపు.. చరిత్రలో కనివీని ఎరుగని రీతిలో ఈ ఏడాది జూలైలో గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. ఒకానొక దశలో వరద 70 అడుగులు దాటింది. భద్రాచలం రామాలయం చెంతకు నీరు చేరింది. పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. భద్రాచలం దగ్గర గోదారిలో 31 అడుగుల నీటిమట్టం దాటితే పర్ణశాల మునిగిపోతుంది. ఇప్పుడు పోలవరం పూర్తైతే ఎప్పుడూ భద్రాచలం వద్ద 43 అడుగుల నీటి మట్టం ఉంటుంది. అదే జరిగితే పర్ణశాల ప్రాంతం జలగర్భంలోకి వెళ్లిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా