AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polavaram: పోలవరాన్ని సందర్శించిన సీడబ్ల్యూసీ.. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ముప్పు..!

గోదావరి వరదల తర్వాత పోలవరం (Polavaram) ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా CWC పరిశీలించింది. అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌తో పాటు ప్రాజెక్ట్‌ ప్రజెంట్‌ సిట్యువేషన్‌ ఎలాగుందో చెక్‌ చేశారు. వందేళ్ల జులై నెల రికార్డును ఈ ఏడాది వచ్చిన వరదలు చెరిపేసిన విషయం...

Polavaram: పోలవరాన్ని సందర్శించిన సీడబ్ల్యూసీ.. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ముప్పు..!
Polavaram
Ganesh Mudavath
|

Updated on: Aug 01, 2022 | 10:51 AM

Share

గోదావరి వరదల తర్వాత పోలవరం (Polavaram) ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా CWC పరిశీలించింది. అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌తో పాటు ప్రాజెక్ట్‌ ప్రజెంట్‌ సిట్యువేషన్‌ ఎలాగుందో చెక్‌ చేశారు. వందేళ్ల జులై నెల రికార్డును ఈ ఏడాది వచ్చిన వరదలు చెరిపేసిన విషయం తెలిసిందే. దీంతో వరదల తర్వాత ప్రాజెక్టును సీడబ్ల్యూసీ బృందం తనిఖీ చేసింది. సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం మహ్మద్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ప్రాజెక్టు స్థితిగతులపై అధ్యయనం చేశారు. ప్రజెంట్‌ సిట్యువేషన్‌, జరుగుతోన్న పనుల గురించి ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ అధికారుల నుంచి ఇన్‌పుట్‌ తీసుకున్నారు. ఊహించనిస్థాయిలో గోదావరి (Godavari) కి వరదలు పోటెత్తడం, అనేక ప్రాంతాలు నీట మునగడంతో పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై విమర్శలు చెలరేగాయి. పోలవరం బ్యాక్‌ వాటర్‌పై తెలంగాణ నుంచి అనేక అభ్యంతరాలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు కారణంగానే టెంపుల్‌ టౌన్ భద్రాచలం మునిగిపోయిందన్న తెలంగాణ ఈఎన్సీ లేఖపైనా సీడబ్ల్యూసీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. బ్యాక్‌ వాటర్ ఎఫెక్ట్‌పై ఇండిపెండెంట్‌ సంస్థతో స్టడీ చేయించాలని కోరుతోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక ఇప్పుడొచ్చిన వరదలే మళ్లీ వస్తే.. భద్రాచలం పూర్తిగా నీట మునిగిపోవడం ఖాయమని తెలంగాణ ఆందోళ వ్యక్తం చేస్తోంది.

కాగా.. పోలవరం డ్యాం నిర్మాణంపై ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌పై అధ్యయనం చేయాలని కోరింది. పోలవరం నిర్మాణం పూర్తయితే వెనుక జలాలతో భద్రాచలం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేస్తే ఏటా భద్రాచలానికి ముప్పేనని లేఖలో తెలిపింది. ఫలితంగా పోలవరం బ్యాక్‌ వాటర్‌పై అధ్యయనం చేయించాలని కోరింది.

మరోవైపు.. చరిత్రలో కనివీని ఎరుగని రీతిలో ఈ ఏడాది జూలైలో గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. ఒకానొక దశలో వరద 70 అడుగులు దాటింది. భద్రాచలం రామాలయం చెంతకు నీరు చేరింది. పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. భద్రాచలం దగ్గర గోదారిలో 31 అడుగుల నీటిమట్టం దాటితే పర్ణశాల మునిగిపోతుంది. ఇప్పుడు పోలవరం పూర్తైతే ఎప్పుడూ భద్రాచలం వద్ద 43 అడుగుల నీటి మట్టం ఉంటుంది. అదే జరిగితే పర్ణశాల ప్రాంతం జలగర్భంలోకి వెళ్లిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం