AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Ordinance Bill: ఢిల్లీకి రాష్ట్ర హోదాను.. నెహ్రూ, అంబేద్కర్‌లు వ్యతిరేకించారు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలని అన్నారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్, సర్దార్‌ వల్లాభాయ్‌, రాజేంద్ర ప్రసాద్ వంటి నేతలు సైతం ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారని వ్యాఖ్యానించారు.

Delhi Ordinance Bill: ఢిల్లీకి రాష్ట్ర హోదాను.. నెహ్రూ, అంబేద్కర్‌లు వ్యతిరేకించారు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Amit Shah
Aravind B
|

Updated on: Aug 03, 2023 | 7:00 PM

Share

పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలని అన్నారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్, సర్దార్‌ వల్లాభాయ్‌, రాజేంద్ర ప్రసాద్ వంటి నేతలు సైతం ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారని వ్యాఖ్యానించారు. మీ కూటమిలో ఉన్నారే కారణంతో ఢిల్లీలో జరుగుతున్న అవినీతిని సపోర్ట్ చేయద్దని అన్ని పార్టీలను కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. ఏ కూటమి ఉన్నప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీ విజయం సాధిస్తారని పేర్కొన్నారు. 2015లో ఢిల్లీలో ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. అక్కడ బంగ్లాల నిర్మాణం వంటి వాటిల్లో అవినీతిని దాచేందుకు విజిలెన్స్ విభాగాన్ని నియంత్రిస్తుండటమే అసలు సమస్య అని అన్నారు.

ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారాలు ఎవరి నియంత్రణలో ఉండాలనే విషయంపై గత కొన్నాల్లుగా కేంద్రం, ఆప్ ప్రభుత్వాల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ పోరాటంపై కొద్ది నెలల క్రితమే ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఐఏఎస్ సహా ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల వంటి వాటిపై పై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని చెప్పింది. ఈ తీర్పు తర్వాత పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్టినెన్స్‌ను తీసుకొచ్చింది. దీని స్థానంలో రూపొందించిన బిల్లునే ప్రస్తుతం లోక్‌సభలో జరుగుతున్న వర్షకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే ఢిల్లీకి సంబంధించి ఏ అంశంపైనా కూడా పార్లమెంట్‌కు చట్టం చేసే అధికారం ఉంటుందని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ ఆర్టినెన్స్ వెల్లడిస్తోంది. అయితే ఢిల్లీకి సంబంధించి చట్టాలు రూపొదించడానికి రాజ్యాంగంలోని నిబంధనలు పర్మిషన్ ఇస్తున్నాయని అమిత్ షా పేర్కొన్నారు.

Follow Us
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్