కశ్మీర్‌పై కదిలిన కేంద్రం.. రేపు పార్లమెంట్‌లో కీలక బిల్లు

జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హో శాఖ సహాయ మంత్రి అమిత్ షా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనతో పాటు ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, “రా” చీఫ్ సామంత్ గోయల్, కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా తదితరులతో ఆయన సమావేశం అయ్యారు. గత ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడి వంటి వాటికి తాజాగా మళ్లీ కశ్మీర్ […]

కశ్మీర్‌పై కదిలిన కేంద్రం.. రేపు పార్లమెంట్‌లో కీలక బిల్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 04, 2019 | 2:09 PM

జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హో శాఖ సహాయ మంత్రి అమిత్ షా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనతో పాటు ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, “రా” చీఫ్ సామంత్ గోయల్, కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా తదితరులతో ఆయన సమావేశం అయ్యారు. గత ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడి వంటి వాటికి తాజాగా మళ్లీ కశ్మీర్ లోయలో పాల్పడవచ్చునని ఇంటలిజెన్స్ నిఘా వర్గాలు హెచ్చరించడంతో అమిత్ షా వీరితో భేటీ అయ్యారు. మరోవైపు త్వరలో కశ్మీర్‌ లోయను అమిత్ షా సందర్శించనున్నారని వార్తలు వస్తున్న వేళ.. అటు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ప్రకటనలు పరిస్థితిని మరింత ఆందోళన కరంగా మారుస్తున్నాయి. రానున్న మూడు రోజులు అత్యంత కీలకమని.. గవర్నర్ చేసిన ప్రకటనతో పాటు.. సాక్షాత్తు మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిపై కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని డిమాండ్ చేయడం విశేషం. దీంతో పాటు ఆర్టికల్ 35ఏ, 370 అధికరణాలను కూడా ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా… కశ్మీర్‌లో అమరనాథ్‌ యాత్రను నిలిపివేయడం, అదనపు బలగాల మోహరింపు.. ఆర్టికల్ 370, 35ఏ రద్దుపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నారనే వదంతులు వంటి వరుస పరిణామాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఓ కీలక బిల్లును అమిత్‌షా సోమవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ ( రెండో సవరణ) బిల్లు -2019 ను ఆయన రాజ్యసభలో ప్రతిపాదించనున్నారు. కశ్మీర్ లోయలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ బిల్లు నిర్ధేశిస్తోంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!