AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS Office: బీఆర్ఎస్ కార్యాలయం వద్ద పోటెత్తిన కార్యకర్తలు, నేతలు.. స్వల్ప తోపులాట

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం కార్యకర్తలు, నేతలతో పోటెత్తిపోతోంది. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ రోజంతా నేతలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కలుస్తున్న నేతలు, కార్యకర్తలు..

BRS Office: బీఆర్ఎస్ కార్యాలయం వద్ద పోటెత్తిన కార్యకర్తలు, నేతలు.. స్వల్ప తోపులాట
Cm Kcr Brs
Subhash Goud
|

Updated on: Dec 16, 2022 | 5:16 PM

Share

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం కార్యకర్తలు, నేతలతో పోటెత్తిపోతోంది. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ రోజంతా నేతలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కలుస్తున్న నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెబుతున్నారు. కేసీఆర్‌ను కలిసేందుకు పార్టీ శ్రేణులు పోటీ పడుతున్నారు. దీంతో కార్యాలయం వద్ద రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. కాగా, ఢిల్లీలో ఉన్న కేసీఆర్‌ జాతీయ స్థాయిలో పార్టీ నిర్మాణం, అలాగే కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా చేయాల్సిన ఉద్యమం గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఉత్తరాదికి చెందిన నేతలు, రైతుల సంఘాల నాయకులతో భేటీ అవుతున్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యవసాయమే ప్రధాన ఆదాయం వనరు. అయితే రైతులు కీలకం కావడంతో వారి ఎజెండాతో ముందుకు సాగాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్‌.

కాగా, ఢిల్లీలో తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఒక రోజు తర్వాత కేసీఆర్‌ దేశవ్యాప్తంగా పార్టీ అడుగుజాడలను విస్తరించాలని యోచిస్తున్నందున కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలలో బహిరంగ సభలను నిర్వహించడంపై దృష్టి పెట్టారు. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్‌ఎస్‌ భావిస్తుండగా, పార్టీ మొదటి పిట్‌స్టాప్, జనవరిలో సంక్రాంతి పండుగ రోజున లేదా అంతకంటే ముందు ర్యాలీని నిర్వహించే అవకాశం ఉంది.

కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జేడీఎస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసే అవకాశాలపై కేసీఆర్ జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామితో చర్చించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి