AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం.. చెత్త బుట్టలో ఆడ శిశువు! వదిలేయడానికి కారణం చెబుతూ లేఖ రాసిపెట్టిన తల్లిదండ్రులు

నవీ ముంబైలోని పన్వెల్‌లో మూడు రోజుల ఆడ శిశువును తల్లిదండ్రులు చెత్తబుట్టలో వదిలిపెట్టారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లీషులో రాసిన ఒక లేఖను శిశువుతో పాటు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి శిశువును ఆసుపత్రికి తరలించారు.

అయ్యో పాపం.. చెత్త బుట్టలో ఆడ శిశువు! వదిలేయడానికి కారణం చెబుతూ లేఖ రాసిపెట్టిన తల్లిదండ్రులు
Abandoned Baby
SN Pasha
|

Updated on: Jun 29, 2025 | 2:48 PM

Share

మూడు రోజుల ఆడ శిశువును ఆమె తల్లిదండ్రులు ఒక చెత్త బుట్టలో పడేసి వెళ్లిపోయారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ ఒక లేఖ రాసి ఆ చిన్నారితో పాటు చెత్త బుట్టలో పెట్టారు. కన్నీళ్లు పెట్టించే ఈ సంఘటన నవీ ముంబైలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నవీ ముంబైలోని పన్వెల్ ప్రాంతంలోని టక్కా కాలనీలో రోడ్డు పక్కన నీలిరంగు బుట్టలో శిశువు పడి ఉందని స్థానికుడు శనివారం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారిని అక్కడి నుంచి తమ వద్దకు తీసుకున్నారని ఒక అధికారి తెలిపారు.

బుట్టలో ఇంగ్లీషులో రాసిన ఒక నోట్ కూడా దొరికింది. అందులో నవజాత శిశువు తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, దీనివల్ల తాము బిడ్డను పెంచలేమని పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు నోట్‌లో “క్షమించండి” అని పేర్కొన్నారు. తమకు వేరే మార్గం కనిపించలేదని ఆ చిన్నారి తల్లిదండ్రులు లేఖలో తెలిపారు. పోలీసులు ఆ నవజాత శిశువును పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆయన పరీక్షించగా ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తేలింది. నవజాత శిశువును విడిచిపెట్టారనే ఆరోపణలపై పన్వెల్ టౌన్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల కోసం వెతుకుతామని పోలీసుల తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి