AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలరోజుల పసికందును ఈడ్చుకెళ్లి చంపేసిన వీధి కుక్కలు.. ఆస్పత్రిలో అమ్మ పక్కన నిద్రపోతుంటే..

సోమవారం అర్థరాత్రి రెండు కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి ప్రవేశించాయని, వాటిలో ఒకటి చిన్నారిని కొరికేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని చెప్పారు.

నెలరోజుల పసికందును ఈడ్చుకెళ్లి చంపేసిన వీధి కుక్కలు.. ఆస్పత్రిలో అమ్మ పక్కన నిద్రపోతుంటే..
Jyothi Gadda
|

Updated on: Feb 28, 2023 | 7:19 PM

Share

ఎక్కడ చూసినా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట వీధి కుక్కల బారిన పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది. నెల వయసున్న పసికందును వీధి కుక్కలు కిరాతకంగా కరిచి చంపేశాయి. రాజస్థాన్​లోని సిరోహి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిందీ దారుణ ఘటన. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల శిశువును వీధికుక్క ఈడ్చుకెళ్లి చంపింది. ఆసుపత్రి వార్డు బయట మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి రెండు కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి ప్రవేశించాయని, వాటిలో ఒకటి చిన్నారిని కొరికేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని చెప్పారు.

అయితే, చిన్నారి తండ్రి మహేంద్ర మీనా సిలికోసిస్‌తో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. సీతారాం, కొత్వాలి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ తన ముగ్గురు పిల్లలతో ఆస్పత్రికి వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆస్పత్రి వార్డులో అందరూ నిద్రపోయారు. చిన్నపాప తల్లి దగ్గర పడుకుంది. ఆమె కూడా నిద్రలోకి జారుకుంది. వార్డులో సిబ్బంది పక్క వార్డులోకి వెళ్లిన సమయంలో రెండు కుక్కలు ఆస్పత్రి టీబీ వార్డులోకి ప్రవేశించాయి. దానిలో ఒక కుక్క పసిపాపను పట్టుకొని బయటకు వచ్చినట్లు సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ద్వారా తెలిసింది. రాత్రి 2 గంటల సమయంలో రేఖ నిద్రలేచింది. పక్కన చూస్తే చిన్నారి లేదు. వార్డు బయటకు వచ్చిన రేఖ.. చిన్నారిని వీధి కుక్కలు కరుస్తున్న దృశ్యాలు చూసి నివ్వెరపోయింది. వాటిని తరిమేసింది. కానీ.. ఆ చిన్నారి ప్రాణాలు మాత్రం దక్కలేదు.

ఈ ఘటనను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ పురోహిత్‌ ఖండిస్తూ.. ఈ దుర్ఘటనకు ఆస్పత్రి అధికారులే కారణమన్నారు. ఇది ఆసుపత్రి నిర్వహణ వైఫల్యం. ఆస్పత్రిలో వీధికుక్కలు సంచరిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ రూపురేఖలు మార్చామని చెబుతున్నారని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

బీజేపీ కార్యకర్తలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి నష్టపరిహారం తదితర డిమాండ్‌లతో ఆందోళనకు దిగారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు జిల్లా అధికార యంత్రాంగానికి వినతి పత్రం అందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి