AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ జైల్లో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవి, 35 మందికి టీబీ.. టెన్షన్‌లో అధికార యంత్రాంగం..!

కొత్త ఖైదీలు జైలుకు వచ్చినప్పుడు ఇలాంటి టెస్టులు మామూలుగానే నిర్వహిస్తారు. ఈ సంఖ్య దాదాపు 125-150గా ఉంటుంది. వీరిలో అధిక సంఖ్యలో ఖైదీలు డ్రగ్స్‌కు బానిసలని చెప్పారు.

ఆ జైల్లో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవి, 35 మందికి టీబీ.. టెన్షన్‌లో అధికార యంత్రాంగం..!
Ghaziabad Dasna Jail
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2022 | 8:16 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. దస్నా జైలులో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా అధికారులు వెల్లడించారు..మొత్తం 5500 మంది ఖైదీల ఆరోగ్య పరీక్షలో 140 మంది ఖైదీలకు హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవి) పాజిటివ్‌గా తేలిందని వారు స్పష్టం చేశారు. జైలు సామర్థ్యం 1704 కాగా, ఐదు వేల మందికి పైగా ఖైదీలను ఈ జైలులో ఉంచారు. ఖైదీల సాధారణ ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ సమయంలో మరో 35 మంది ఖైదీలకు టీబీ కూడా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు అధికారి తెలిపారు. రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ద్వారా హెచ్‌ఐవీ రోగులకు చికిత్స అందిస్తున్నారు. 140 మంది ఖైదీలు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా ఉన్నారనే వార్తతో జైలు యంత్రాంగంలో కలకలం రేపింది. అనంతరం ఖైదీలందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. HIV అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసే ఒక వైరల్ వ్యాధి. సకాలంలో చికిత్స చేయకపోతే HIV అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (AIDS)కి దారితీస్తుంది.

దస్నా జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ… సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరుగుతాయని, ఇందులో హెచ్‌ఐవి నిర్ధారణ అయిందని చెప్పారు. హెచ్‌ఐవీ అంటరానితనం వల్ల వచ్చే వ్యాధి కాదని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ఇది స్పర్శ ద్వారా వ్యాపించదు. ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఖైదీలందరినీ సాధారణ ఖైదీలతో పాటు ఉంచుతారు. ప్రస్తుతానికి భయపడాల్సిన పనిలేదు. ఇది రొటీన్ పని. రోజూ తనిఖీలు చేస్తున్నారు. కొత్త ఖైదీలు జైలుకు వచ్చినప్పుడు ఇలాంటి టెస్టులు మామూలుగానే నిర్వహిస్తారు. ఈ సంఖ్య దాదాపు 125-150గా ఉంటుంది. వీరిలో అధిక సంఖ్యలో ఖైదీలు డ్రగ్స్‌కు బానిసలని చెప్పారు. డ్రగ్స్ కోసం వాడే సిరంజీలను వాడడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. 35 మంది టిబి రోగులను విడిగా ఏర్పాటు చేసి ఉంచారు. అక్కడ వారు చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు, దీనికి ముందు అజంగఢ్‌లోని హైటెక్ జైలులో ఖైదీలకు హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహించారు. కాగా, జైలులో ఉన్న పది మంది ఖైదీలు హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించారు. చాలా మంది ఖైదీలు టెస్ట్‌లు జరగకుండా తప్పించుకుంటున్నారు. అజంగఢ్ జైలులో మొత్తం 2500 మంది మహిళా, పురుష ఖైదీలు ఉన్నారు. 1,322 మంది ఖైదీలను విచారించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ విషయమై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఐఎన్ తివారీ మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు ఖైదీలకు హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మొత్తం 10 మంది రోగులు హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించారు. అందరినీ సాధారణ ఖైదీల మాదిరిగానే ఉంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
దరిద్రానికి దారితీసే అలవాట్లు ఇవే.. జాగ్రత్తగా ఉండమంటున్న..
దరిద్రానికి దారితీసే అలవాట్లు ఇవే.. జాగ్రత్తగా ఉండమంటున్న..
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..