AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..

Telangana Tourism: తెలంగాణ, ఏపీ బార్డర్ లో ఉండే పాపికొండలను చూడ్డానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మొన్నటి వరకు వర్షాల నేపథ్యంలో ఆగిపోయిన పాపికొండల సందర్శన ఆగిపోయింది. అయితే తాజాగా మళ్లీ టూర్ ను ఆపరేట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రారంభించేందుకు సిద్దమవుతోంది..

గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..
Telangana Tourism
Narender Vaitla
|

Updated on: Oct 21, 2024 | 10:00 AM

Share

Telangana Tourism: ఇరువైపుల పెద్ద పెద్ద కొండలు, మధ్యలో నిశ్శబ్ధంగా ముందుకు సాగే గోదావరి నది. అందులో బోటు ప్రయాణం. ఊహించుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉండే ఈ ప్రయాణం పాపికొండల సొంతం. ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పాపికొండలను వీక్షించేందుకు ఎంతో మంది ప్రయాణికులు క్యూ కడుతుంటారు.

ఇటీవల వర్షాల కారణంగా నిలిచిపోయిన పాపికొండలు టూర్‌ ప్యాకేజ్‌ తాజాగా మళ్లీ ప్రారంభమైంది. ఈ నేపపథ్యంలో తెలంగాణ టూరిజం పాపికొండలు టూర్‌ ప్యాకేజీని తిరిగి ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ప్యాకేజీని ప్రారంభించనున్నారు. గోదావరి నీటితో నిండి ఉండే ఈ సమయంలో పాపికొండల్లో ప్రయాణం జీవితంలో మర్చిపోలేని ఓ అనుభూతిని ఇవ్వడం ఖాయం. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం ఆఫర్‌ చేసే ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ టూరిజం ‘పాపికొండలు రోడ్ కమ్‌ రివర్‌ క్రూయిజ్‌’ పేరుతో ఈ ప్యాకేజీన అందిస్తోంది. మూడు రోజుల పాటు సాగే ఈ టూర్ హైదరాబాద్‌ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయాణం ఇలా సాగుతుంది..

* తొలిరోజు రాత్రి 7.30 గంటలకు ఐఆర్‌ఓ ప్రయాణిక్‌ భవన్‌ నుంచి టూర్‌ ప్రారంభమవుతుంది. 8 గంటలకు బషీర్‌బాగ్లోని సీఆర్‌ఓ ఆఫీస్‌ నుంచి బయలుదు దేరుతుంది. రాత్రంతా భద్రాచలంకు జర్నీ ఉంటుంది.

* రెండో రోజుం 6 గంటలకు వరకు భద్రాచలంలోని హరిత హోటల్‌కు చేరుకుంటారు. అనంతరం పోచారం బోటింగ్‌ పాయింట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బోటు ప్రయాణం ఉంటుంది. రాత్రి హరిత హోటల్‌కు చేరుకుంటారు. బస హోటలోనే ఉంటుంది.

* ఇక మూడో ఉదయం భద్రచలం శ్రీరాముల వారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత పర్నశాలకు వెళ్తారు. అనంతరం మధ్యాహ్నం భోజనం సమయానికి హరిత హోటల్‌కు చేరుకొని భోజనం చేస్తారు. భోజనం చేసిన తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 10గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు..

ధర విషయానికొస్తే పెద్దలకు రూ. 6999గా, చిన్నారులకు రూ. 5599గా నిర్ణయించారు. టూర్‌ ప్యాకేజీలో నాన్‌ ఏసీ బస్సు, హోటల్‌లో గదులు, బోటింగ్‌, బోట్‌లో ఫుడ్‌ కవర్‌ అవుతాయి. ఇతర ఖర్చులన్నీ ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.