AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food: రొయ్యలు తినగానే వీటి జోలికి అస్సలు వెల్లకండి.. చాలా డేంజర్‌

రొయ్యలు.. మనలో చాలా మంది వీటిని అత్యంత ఇష్టంగా తింటుంటారు. రుచితో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు వీటితో పొందొచ్చు. అయితే ఆరోగ్యానికి మంచి చేసే రొయ్యలు కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి కూడా కారణంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రొయ్యలు తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని...

Food: రొయ్యలు తినగానే వీటి జోలికి అస్సలు వెల్లకండి.. చాలా డేంజర్‌
Food
Narender Vaitla
|

Updated on: Jun 11, 2024 | 12:10 PM

Share

రొయ్యలు.. మనలో చాలా మంది వీటిని అత్యంత ఇష్టంగా తింటుంటారు. రుచితో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు వీటితో పొందొచ్చు. అయితే ఆరోగ్యానికి మంచి చేసే రొయ్యలు కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి కూడా కారణంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రొయ్యలు తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ రొయ్యలు తీసుకోగానే దూరంగా ఉండాల్సిన ఆ ఫుడ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా కొందరు ప్రాన్స్‌ చేసే సమయంలో క్రీమ్‌ సాస్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే దీనివల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రొయ్యలు తీసుకున్న వెంటనే పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పాల ఉత్పత్తుల్లోని కాల్షియం రొయ్యల్లోని ప్రోటీన్‌లతో చర్య జరుపుతుంది. ఇది జీర్ణక్రియ సమస్యలకు, కడుపు నొప్పికి కారణమవుతుంది.

* రొయ్యల ఫ్రై అంటేనే చాలా స్పైసీగా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే సాధారణంగా రొయ్యలు వేడి చేస్తాయి. అందులోనూ బాగా స్పైసీగా తీసుకుంటే కడుపులో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* రొయ్యలు తీసుకున్న వెంటనే రెడ్‌ మీట్‌ లేదా బచ్చలికూరను అస్సలు ముట్టుకోకూడదు. సాధారణంగానే రొయ్యలలో ఐరన్‌ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రెడ్‌మీట్‌లోనూ ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే ఐరెన్‌ లోపం ఉన్న వాళ్లకి పర్వాలేదు కానీ ఎక్కువగా ఉన్న వారికి మాత్రం ఇది హానికరంగా చెబుతున్నారు.

* పిండి ఎక్కువగా ఉండే బ్రెడ్‌ వంటి వాటితో రొయ్యలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కడుపు త్వరగా ఉబ్బిన భావన కలగడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* ఇక రొయ్యల ఫ్రైలో నిమ్మకాయ రసం పిండుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే రొయ్యలతో పాటు సిట్రస్‌ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్‌ పండ్లలోని ఆమ్లత్వం రొయ్యల్లోని ప్రోటీన్లతో చర్య జరుపుతుంది. ఇది కడుపు నొప్పికి దారి తీస్తుంది.

నోట: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..