AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : బాబోయ్.. వీళ్లు బాదం పప్పును అస్సలు తినకూడదు.. తింటే చాలా బాధలే..!

డ్రై ఫ్రూట్స్‌లో బాదంది ప్రత్యేక స్థానం. రోజూ 20 గ్రాముల బాదం తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్‌తో సహా అనేక రకాల వ్యాధులను నివారించవచ్చు. పరిశోధన ప్రకారం, రోజూ గుప్పెడు బాదం తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం దాదాపు 30 శాతం తగ్గుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని 15 శాతం, అకాల మరణ ప్రమాదాన్ని 22 శాతం తగ్గిస్తుంది. బాదం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వాటికి ప్రతికూలతలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరు బాదంపప్పుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి వ్యక్తులు బాదం తినకూడదో ఇక్కడ చూద్దాం..

Health Tips : బాబోయ్.. వీళ్లు బాదం పప్పును అస్సలు తినకూడదు.. తింటే చాలా బాధలే..!
Almonds
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2025 | 9:16 PM

Share

బాదం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ వాటిలో కేలరీలు, కొవ్వు కూడా ఎక్కువగా ఉంటాయి. మూడు నుండి నాలుగు బాదం పప్పులలో 168 కేలరీలు మరియు 14 గ్రాముల కొవ్వు ఉంటుంది. రోజూ గుప్పెడు బాదం తినడం వల్ల 500 కేలరీలు, 40 నుండి 50 గ్రాముల కొవ్వు లభిస్తుంది. కాబట్టి, మీరు బరువు తగ్గాలనుకుంటే, బాదం పప్పులను పరిమితం చేయండి. అధిక బీపీ ఉన్న వారు బాదం పప్పును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ మందులను వాడుతూ బాదం పప్పులను తినడం చాలా డేంజర్‌ అంటున్నారు. ఈ అధిక రక్తపోటు కారణంగా హార్ట్‌ ఎటాక్‌, హార్ట్‌ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి.

బాదంలో చాలా కొద్ది మొత్తంలో సైనైడ్ ఉంటుంది. ఎక్కువగా తింటే ప్రమాదం తప్పదు. బాదంలో విటమిన్-ఈ కొద్ది మొత్తంలో మాత్రమే శరీరానికి అవసరం. ఎక్కువైతే అలెర్జీలు వస్తాయి. ఒకేసారి ఎక్కువ బాదం పప్పు తింటే జీర్ణవ్యవస్థలో అసౌకర్యం ఏర్పడుతుంది.

బాదం పప్పులో ఫైటిక్ యాసిడ్ ఒక యాంటీ-న్యూట్రియెంట్. విటమిన్లు, ఖనిజాల శోషణను తగ్గిస్తుంది. బాదం పప్పులో ఆక్సలేట్‌లు ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది. బాదం పప్పులను అమితంగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది వ్యక్తులకు బాదం అలెర్జీ ఉంటుంది. మోతాదుకు మించి తీసుకుంటే వారు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా బాదంపప్పులు తినడం మంచిది కాదు

ఇవి కూడా చదవండి

మైగ్రేన్ తో బాధపడేవారు బాదం తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. మైగ్రేన్‌ లేదా తలనొప్పి ఉన్నప్పుడు బాదం తింటే ఈ సమస్య మరింత పెరుగుతుంది. మైకం, వికారం, వాంతులు, అలసట వంటి సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే, బాదం పప్పు తీసుకోవడంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాదం పప్పులో గణనీయమైన మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. మూడు నుండి నాలుగు బాదం పప్పులలో 0.6mg మెగ్నీషియం ఉంటుంది. అయితే మీ శరీరానికి రోజుకు 1.8 నుండి 2.3mg అవసరం. అందువల్ల, దీని కంటే ఎక్కువ బాదం తినడం మందుల ప్రభావాన్ని ప్రభావితం చేయవచ్చు. రక్తంలో అధిక స్థాయిలో మెగ్నీషియం ఉండటం వల్ల యాంటాసిడ్లు, లాక్సేటివ్లు, రక్తపోటు మందులు మరియు యాంటిసైకోటిక్ మందులతో సహా కొన్ని యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని తగ్గించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..