ఇంటి పేరు లేదని.. విమానం ఎక్కించుకోలేదు..ఎయిర్లైన్ సంస్థకు భారీ జరిమానా
ఇంటిపేరు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది అయిన వ్యక్తిని విమానం ఎక్కనివ్వలేదు విమానయాన సిబ్బంది. దీంతో ఆయన చెన్నైలోని వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించగా, గల్ఫ్ ఎయిర్ తన తప్పిదాన్ని గుర్తించి నిజాముద్దీన్కు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. టికెట్ ఖర్చు, మానసిక వేదనకు కలిపి ప్రయాణ తేదీ నుండి సంవత్సరానికి రూ.1.4 లక్షలు 9శాతం వడ్డీతో చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.

పాస్పోర్ట్లో ఇంటిపేరు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది అయిన వ్యక్తిని విమానం ఎక్కనివ్వలేదు విమానయాన సిబ్బంది. ఆ వ్యక్తి తన గురించి చెప్పుకుని తాను ఇప్పటికీ అనేక సందర్బాల్లో విమాన ప్రయాణం చేశానని ఎంతగా చెప్పినప్పటికీ సిబ్బంది నిరాకరించారు. ఈ ఘటన తమిళనాడు మాజీ ఎమ్మెల్యేకు ఎదురైంది. పాస్పోర్ట్లో ఇంటిపేరు లేకపోవడంతో తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది అయిన నిజాముద్దీన్ను గల్ఫ్ ఎయిర్ మాస్కో ఎయిర్పోర్టులో బోర్డింగ్కు నిరాకరించింది. దీంతో ఆయన చెన్నైలోని వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించగా, గల్ఫ్ ఎయిర్ తన తప్పిదాన్ని గుర్తించి నిజాముద్దీన్కు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. టికెట్ ఖర్చు, మానసిక వేదనకు కలిపి ప్రయాణ తేదీ నుండి సంవత్సరానికి రూ.1.4 లక్షలు 9శాతం వడ్డీతో చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
తమిళనాడు పెరియామెట్ నివాసి అయిన నిజాముద్దీన్ పాస్పోర్ట్ ఒకే పేరుతో ఉండటంతో మాస్కో విమానాశ్రయంలో గల్ఫ్ ఎయిర్ విమానం ఎక్కడానికి అనుమతి లేకుండా ఆపారు. ఫిబ్రవరి 9, 2023న అతను మాస్కో నుండి బహ్రెయిన్ మీదుగా దుబాయ్కు గల్ఫ్ ఎయిర్ విమానంలో ప్రయాణించాల్సి ఉంది. కానీ అతని పాస్పోర్ట్లో ఇంటిపేరు లేకుండా అతని పేరు నిజాముద్దీన్ మాత్రమే ఉండటంతో ప్రయాణానికి నిరాకరించారు సిబ్బంది. పాస్పోర్ట్లో అదే పేరుతో భారతదేశం నుండి మాస్కోకు విమానం ఎక్కడానికి తనకు అనుమతి ఉందని నిజాముద్దీన్ పేర్కొన్నాడు.
కానీ, ఎయిర్లైన్ గ్రౌండ్ సిబ్బంది అతని అభ్యర్థనలను పట్టించుకోలేదు. దాదాపు గంటన్నర పాటు వేచి ఉండేలా చేశారు. యుఎఇ చేరుకోవడంలో జరిగిన అతి ఆలస్యం కారణంగా అతను తీవ్ర ఒత్తిడికి, ఇబ్బందులకు గురయ్యాడు. దీని కారణంగా అతను ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్, ప్రయాణ పత్రంలో మరొక పేజీలో వారి ఇంటి పేరు కనిపిస్తే, ఒకే పేరు ఉన్న ప్రయాణీకులు ప్రయాణించడానికి అనుమతించే కీలక నియమానికి సవరణను మాజీ ఎమ్మెల్యే విషయంలో పాటించలేదని ఇటీవల గుర్తించారు.
విమానయాన సంస్థలు టికెట్ ధర అయిన రూ.29,689 తిరిగి చెల్లించాలని, సర్వీస్ లోపం, ఆర్థిక నష్టం, మానసిక వేదన, బాధలకు పరిహారంగా రూ.1 లక్ష చెల్లించాలని, వ్యాజ్యం ఖర్చుగా రూ.10,000 చెల్లించాలని కూడా ఆదేశించినట్లు కమిషన్ తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..








