Lifestyle: మైగ్రేన్ నొప్పికి సింపుల్ చిట్కా.. నిజంగానే పనిచేస్తుందా.?
మైగ్రేన్ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు సాధారణంగా ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని రకాల నేచురల్ టిప్స్ పాటించడం ద్వారా మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాంటి వాటిలో వేడి నీటిలో కాళ్లు పెట్టడం వల్ల ఈ సమస్య నుంచి ఇట్టే బయటపడొచ్చని చెబుతుంటారు..
మైగ్రేన్ నొప్పి.. ఇటీవల చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వినడానికి చిన్న సమస్యగానే అనిపించినా దీని బారిన పడిన వారు మాత్రం నరకం అనుభవిస్తుంటారు. తలలో భరించలేని నొప్పి వస్తుంటుంది. అయితే మైగ్రేన్ నొప్పికి ఎన్నో సహజ చిట్కాలను పాటిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి వేడి నీటిలో కాళ్లు పెట్టడం. వేడి నీటిలో పాదాలు ఉంచడం వల్ల మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందన్న దాంట్లో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో ఎన్నో రకాల సహజ చిట్కాలు ఉంటాయి. సహజంగా ఆవిరి పట్టుకోవడం, శ్వాస సంబంధిత యోగా.. మెడిటేషన్ వంటివి చేయాలని చెబుతుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో చిట్కా కూడా వైరల్ అవుతోంది. మీ పాదాలను వేడి నీటిలో పెట్టడం వల్ల మైగ్రేషన్ నొప్పి తగ్గుతుందని నెట్టింట వైరల్ అవుతోంది.
వైద్యుల అభిప్రాయం ప్రకారం ఈ చిట్కా.. ఎఫెక్టివ్గా పనిచేస్తుందని అంటున్నారు. అయితే గోరు వెచ్చని నీటిలో కాళ్లు పెట్టాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయని, ఇది మైగ్రేన్ నొప్పిని దూరం చేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తపోటును తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర ఉపయోగపడుతుంది.
మైగ్రేన్ నొప్పికి పెయిన్ కిల్లర్స్, స్ప్రేలు ఉపయోగించడం కంటే ఇలా వేడి నీటి చిట్కా మెరుగ్గా పనిచేస్తుందని అంటున్నారు. గోరువెచ్చని నీటిలో 15 నుంచి 20 నిమిషాల పాటు పెట్టాలి. అయితే నీరు 37 నుంచి 43 డిగ్రీల మధ్య ఉండాలి. అంతకంటే ఎక్కువ వేడి ఉండడం మంచిది కాదని అంటున్నారు. ఇక వేడి నీటిలో లావెండర్ ఆయిల్, ఆముదం వంటివి వేడి నీటిలో వేసుకుంటే మరింత మేలు జరుగుతుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..