AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bathing: భోజనం చేశాక స్నానం చేస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

స్నానం అనేది శరీరానికి చాలా అవసరం. బాహ్య శరారీన్ని స్నానం చేయడం ద్వార శుభ్రం చేసుకుంటాం. ఉదయం, రాత్రి స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. స్నానం చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి, మానసిక ఒత్తిడి, శరీర నొప్పులు వంటివి దూరం అవుతాయి. చాలా రిలీఫ్‌గా ఉండి చికాకు వంటివి పోతాయి. అయితే స్నానం చేసే విషయంలో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. కొందరు స్నానం చేసి భోజనం చేస్తే.. చాలా వరకు భోజనం చేశాక నిద్రించే..

Bathing: భోజనం చేశాక స్నానం చేస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
Bathing
Chinni Enni
|

Updated on: Oct 28, 2024 | 4:35 PM

Share

స్నానం అనేది శరీరానికి చాలా అవసరం. బాహ్య శరారీన్ని స్నానం చేయడం ద్వార శుభ్రం చేసుకుంటాం. ఉదయం, రాత్రి స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. స్నానం చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి, మానసిక ఒత్తిడి, శరీర నొప్పులు వంటివి దూరం అవుతాయి. చాలా రిలీఫ్‌గా ఉండి చికాకు వంటివి పోతాయి. అయితే స్నానం చేసే విషయంలో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. కొందరు స్నానం చేసి భోజనం చేస్తే.. చాలా వరకు భోజనం చేశాక నిద్రించే ముందు స్నానం చేస్తారు. ఇది చాలా తప్పు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేశాక స్నానం చేయడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

జీర్ణ సంబంధిత సమస్యలు:

భోజనం చేశాక స్నానం చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భోజనం చేశాక స్నానం చేయడం వల్ల తేడా ఏముందని అనుకుంటారు. దీని వల్ల మీరు తిన్న ఆహారం జీర్ణ అయ్యే సమయం అనేది చాలా వరకు మందగిస్తుంది. దీంతో గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

నాడీ వ్యవస్థ నెమ్మదిస్తుంది:

తిన్న తర్వాత స్నానం చేయడం వల్ల నాడీ వ్యవస్థపై కూడా ప్రెజర్ పడుతుంది. సాధారణంగా భోజనం చేశాక జీర్ణ క్రియ సాఫీగా సాగేలా నాడీ వ్యవస్థ చేస్తుంది. రక్త ప్రసరణను వేగంగా చేసి ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కానీ భోజనం చేసిన స్నానం చేయడం వల్ల ఈ ప్రక్రియ మొత్తానికి ఆటంకం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

నెమ్మదిగా రక్త ప్రసరణ:

సాధారణంగా స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఈ క్రమంలోనే శరీరాన్ని చల్ల బరిచేందుకు రక్త నాళాల్లో.. రక్త ప్రసరణ అనేది పెరుగుుతంది. దీంతో చర్మం ద్వారా వేడి బయటకు పోతుంది. అయితే అప్పటికే మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి రక్త ప్రసరణ వేగంగా జరుగుతూ ఉండగా.. దీనికి అడ్డంకి ఏర్పడుతుంది. దీంతో అన్నం అరగక పోవడం, గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..