AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: కరోనా తర్వాత ఎందుకు గుండె పోటు కేసులు పెరుగుతున్నాయో కనిపెట్టేసిన ఎయిమ్స్..

కరోనా మహమ్మారి తర్వాత గుండె జబ్బులు గణనీయంగా పెరిగాయని ఎయిమ్స్ తెలిపింది. కోవిడ్ తర్వాత చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అయితే కరోనా తర్వాత గుండెపోటు కేసులు ఎందుకు పెరిగాయి. ఇప్పుడు ఈ విషయం గురించి తెలిసింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు.

Heart Attack: కరోనా తర్వాత ఎందుకు గుండె పోటు కేసులు పెరుగుతున్నాయో  కనిపెట్టేసిన ఎయిమ్స్..
Heart Attack Cases
Surya Kala
|

Updated on: Nov 30, 2024 | 10:43 AM

Share

కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగాయి. గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలిసిందని ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఫార్మకాలజీ సదస్సులో నిపుణులు చెప్పారు. మెదడు నుంచి విడుదలయ్యే కాటెకోలమైన్ హార్మోన్లతో పాటు ఆక్సీకరణ ఒత్తిడి వల్ల ఇలాంటి కేసులు పెరగడం వెనుక ఉన్న కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి శరీరంలో N ప్రోటీన్ ఉంటుంది. ఇవి AC2చే నియంత్రించబడతాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరిగినప్పుడు, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీన్ని నియంత్రించేందుకు మెదడు నుంచి కేటెకోలమైన్ హార్మోన్లు విడుదలవుతాయి. దీని పని గుండెను నియంత్రించడం. అయితే కేటెకోలమైన్ హార్మోన్లు అధికంగా విడుదల కావడం వలన గుండె పంపింగ్ లను నిలిపివేస్తుంది. ఇది రోగి మరణానికి దారితీస్తుంది.

ఢిల్లీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, రీసెర్చ్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ గోయల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ.. కోవిడ్ యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ 2 (ACE2) ను ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఇది సైటోకిన్‌ల మొత్తం నిర్మాణాన్ని మారుస్తుంది.

అంతేకాదు దీని కారణంగా సైటోకినిసిస్ లేదా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ శరీరంలో అకస్మాత్తుగా పెరుగుతాయి. అప్పుడు రక్తం గట్టిపడటం ప్రారంభమవుతుంది. ఇది గుండె నరాలపై ఒత్తిడి తెస్తుంది. అప్పుడు గుండె ఆగిపోతుంది.” ACE 2 తర్వాత చాలా మార్పులు వస్తాయని ఆయన అన్నారు. CE 2, Renin Angiotensin Aldosterone గురించి తెలుసుకున్న తర్వాత కొంత మార్పు వస్తుంది. ఫైబ్రోసిస్‌పై చేయాల్సిన పని ఉందని ప్రజలు గ్రహించారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

కోవిడ్ కారణంగా ఫైబ్రోసిస్

కోవిడ్‌ వల్ల వచ్చే ఫైబ్రోసిస్‌ వల్ల శరీరంలోని ఈ వ్యవస్థ దెబ్బతింటుందని డాక్టర్‌ గోయల్‌ తెలిపారు. కొంతమంది దీనిని లాంగ్ కోవిడ్ అని కూడా పిలుస్తున్నారు. ఈ విషయంపై జన్యు విశ్లేషణ కూడా అవసరం. ఫైబ్రోసిస్‌లో ACE స్థాయిని నిరంతరం తనిఖీ చేయడం కూడా చాలా ముఖ్యం.

లాంగ్ కోవిడ్, కర్ణిక దడ కారణంగా గుండె కండరాలు సక్రమంగా పనిచేయలేకపోతున్నాయని.. అందుకే ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్ రమేష్ గోయల్ చెప్పారు. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. దీనికి కాలుష్యం కూడా ఒక పెద్ద కారణం. ఇందులో పర్యావరణం పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పారు డాక్టర్ రమేష్ గోయల్.

55% మంది రోగులు గుండెపోటు తీవ్రతను అర్థం చేసుకోలేక మృతి

55% మంది రోగులు గుండెపోటు తీవ్రతను అర్థం చేసుకోలేక మరణించారని ఎయిమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కృష్ణన్ తెలిపారు. అందువల్ల గుండెపోటు లక్షణాలు కనిపిస్తే, త్వరగా ఇంటి నుంచి బయలుదేరి ఆసుపత్రికి చేరుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే రోగిని రక్షించే అవకాశాలు పెరుగుతాయి. ఛాతీలో నొప్పి వచ్చినప్పు వెంటనే అప్రమత్తం అవడం ముఖ్యం. ఇప్పటికే సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు డాక్టర్ రమేష్ గోయల్.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..