గ్లాసు మజ్జిగలో ఈ ఒక్క పదార్థం కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం.. మధుమేహానికి మందు!
పూర్వం ఆహారంలో మజ్జిగకు ప్రాధాన్యత ఉండేది. మధుమేహ రోగులకు మజ్జిగ దివ్యౌషధంలా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది కీలకం. కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందిస్తుంది. ఒక గ్లాసు మజ్జిగలో ఈ ఒక్క పదార్థం కలిపి గంట తర్వాత తాగితే చక్కెర స్థాయిలు తగ్గుతాయి, మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలోనూ తోడ్పడుతుంది.

పూర్వం రోజుల్లో ప్రజలు తమ ఆహారంలో గంజి లేదా మజ్జిగను ఎక్కువగా తీసుకునేవారు. గంజి,మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్యి. కానీ, మారుతున్న అలవాట్ల కారణంగా మనలో చాలా మంది ఇప్పుడు జ్యూస్లు తాగుతున్నారు.. ఒకప్పుడు మజ్జిగ చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కూడా గ్రామాల్లో చాలా మంది మజ్జిగను ఎక్కువగా తీసుకుంటారు. అయితే, ఈ మజ్జిగ తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా నియంత్రించాలో మీకు తెలుసా..?
మధుమేహ రోగులు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల, వారు అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. కానీ, మజ్జిగ మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.. అంతేకాదు..వారికి దివ్యౌషధంగా కూడా పనిచేస్తుంది. మజ్జిగ శరీరానికి కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి అనేక పోషకాలను అందిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల బాధితులు చేతులు, కాళ్లల్లో కోల్పోతారు. వారు వివిధ రకాల నొప్పులను అనుభవిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఆహారంలో పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకోవడం శరీరానికి మంచిది. మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. కానీ, మజ్జిగలో ఒక పదార్థాన్ని కలిపి తీసుకోవటం వల్ల రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. అదేంటో ఇక్కడ చూద్దాం…
ఒక గ్లాసు మజ్జిగలో 10 నుండి 15 కరివేపాకు ఆకులు వేసి, మూతపెట్టి, దాదాపు 1 గంట పాటు అలాగే ఉంచండి. తర్వాత ఈ మజ్జిగ తాగండి. కరివేపాకు మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కరివేపాకు మూత్రపిండాల్లో రాళ్లను కరిగిందేకు కూడా మంచి ఇంటి నివారణగా పనిచేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




