AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధుమేహ బాధితులకు వరం..మీ ఉదయాన్నిఈ నీటితో మొదలుపెట్టారంటే అమృతమే!

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మధుమేహం (డయాబెటిస్) బారిన పడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Levels) ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవడం మధుమేహ బాధితులకు పెద్ద సవాలుగా మారుతుంది. దీని కోసం టాబ్లెట్లతో పాటు సహజసిద్ధమైన ఇంటి చిట్కాలను పాటించడం ఎంతో మేలు చేస్తుంది. మన వంటగదిలో లభించే మెంతులు, జీలకర్ర రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రభావవంతమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహ బాధితులకు వరం..మీ ఉదయాన్నిఈ నీటితో మొదలుపెట్టారంటే అమృతమే!
Best Drinks For DiabetesImage Credit source: tv9 malayalam
Jyothi Gadda
|

Updated on: Jun 28, 2026 | 6:35 AM

Share

మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం (డయాబెటిస్) బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో బాధితులు తమ జీవిత కాలం మందులు వాడుతునే ఉండాల్సి వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇంకా అనేక ఆహార నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని వంటింటి చిట్కాలు డయాబెటిక్‌ బాధితులకు అద్బుతంగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

జీలకర్ర నీటి ప్రయోజనాలు (Jeera Water Benefits):

ఆరోగ్య నిపుణుల ప్రకారం, జీలకర్ర నీరు మధుమేహ బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వచ్చే వాపులను (Inflammation) తగ్గించి, కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా టైప్-2 మధుమేహం ఉన్నవారిలో ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరువెచ్చని జీలకర్ర నీటిని తాగడం వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. అంతేకాకుండా, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది. బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

మెంతుల నీటి ప్రయోజనాలు (Methi Water Benefits):

రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వేగంగా తగ్గించుకోవాలనుకునే వారికి మెంతుల నీరు ఒక అద్భుతమైన వరం. ఒక చెంచా మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం పూట ఆ నీటిని తాగి, నానిన మెంతులను నమలడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగవుతుంది. మెంతులు జీర్ణవ్యవస్థలోకి వెళ్లిన తర్వాత ఒక జెల్ లాంటి పదార్థంగా మారి, మనం తినే ఆహారం నుండి గ్లూకోజ్ శోషణను (Glucose Absorption) నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల భోజనం తర్వాత చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగవు. అలాగే ట్రైగ్లిసరైడ్స్, ఎల్‌డీఎల్ (LDL) వంటి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది తోడ్పడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను త్వరితగతిన అదుపులోకి తెచ్చుకోవడానికి మెంతుల నీరు అత్యుత్తమమైనది. అదేవిధంగా జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, బరువు తగ్గడానికి జీలకర్ర నీరు బాగా ఉపయోగపడుతుంది. అయితే, ఏ చిట్కాలను పాటించినప్పటికీ సరైన జీవనశైలి, సమతుల్య ఆహారం, వైద్యుల సలహాలను అనుసరించడం ద్వారా మాత్రమే మధుమేహాన్ని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us