AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? అమృతం లాంటి పండు కూడా విషంగా మారవచ్చు.. జాగ్రత్త!

వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ ముందుగా గుర్తొచ్చేది పండ్ల రాజు మామిడి (Mango). తీపి రుచి, అద్భుతమైన సువాసన కలిగిన మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఇందులో విటమిన్ ఎ, సి, పొటాషియం మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, మామిడి పండ్లను ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ జరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడి పండ్లను తినడానికి సరైన సమయం ఏది? వాటిని తినే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మామిడి పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? అమృతం లాంటి పండు కూడా విషంగా మారవచ్చు.. జాగ్రత్త!
Mango Diet TipsImage Credit source: News 9
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2026 | 12:56 PM

Share

వేసవి కాలంలో నోరూరించే మామిడి పండ్లను తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ, వాటిని తినేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మామిడి పండ్లను తినేందుకు సరైన సమయం ఏంటి..? ఎవరూ మామిడి పండ్లకు దూరంగా ఉండాలి. ఎవరు ఎంత తినాలి అనేది తప్పక తెలుసుకోవాలి. లేదంటే, అమృతంలాంటి పండు కూడా విషంగా మారే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే…

మామిడి పండ్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో లేదా మధ్యాహ్నం స్నాక్స్ సమయం (లంచ్‌కు ముందు లేదా తర్వాత 2 గంటల గ్యాప్) లో తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ సమయంలో తినడం వల్ల శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. చాలా మంది భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే మామిడి పండ్లను డెజర్ట్‌గా తింటుంటారు. ఇది చాలా తప్పుడు పద్ధతి. దీనివల్ల శరీరంలో క్యాలరీలు, చక్కెర స్థాయిలు (Blood Sugar) ఒక్కసారిగా పెరిగిపోతాయి. రాత్రి పడుకునే ముందు మామిడి పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడి అజీర్తి, గ్యాస్, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

అలాగే, మామిడి పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే తినకూడదు. వాటిని కనీసం 1 నుండి 2 గంటల పాటు చల్లటి నీటిలో నానబెట్టాలి. మామిడి పండ్లలో ఫైటిక్ యాసిడ్ (Phytic Acid) అనే సహజ రసాయనం ఉంటుంది, ఇది శరీరంలో వేడిని కలిగిస్తుంది. నీటిలో నానబెట్టడం వల్ల ఆ వేడి తగ్గిపోతుంది. తద్వారా ముఖంపై మొటిమలు, వేడి గడ్డలు, మలబద్ధకం వంటి సమస్యలు రావు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత కాలంలో మామిడి పండ్లను త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను వాడుతున్నారు. నీటిలో బాగా కడగడం వల్ల ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ తొలగిపోతాయి. మధుమేహం (Diabetes) ఉన్నవారు మామిడి పండ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలు మాత్రమే పరిమితంగా తినాలి. అతిగా తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపు తప్పుతాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ అమృతం లాంటి పండును సరైన సమయంలో, సరైన పద్ధతిలో తిన్నప్పుడే దాని పూర్తి పోషకాలు మన శరీరానికి అందుతాయి. కాబట్టి ఈ వేసవిలో పైన పేర్కొన్న చిట్కాలను పాటిస్తూ మామిడి పండ్ల రుచిని సురక్షితంగా ఆస్వాదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
WTC ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్? ఆ 3 జట్ల ఓటమిపైనే ఆశలన్నీ?
WTC ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్? ఆ 3 జట్ల ఓటమిపైనే ఆశలన్నీ?
మామిడి పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?విషంగా మారవచ్చు!
మామిడి పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?విషంగా మారవచ్చు!
500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లు వస్తున్నాయా..?
500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లు వస్తున్నాయా..?
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!