AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zydus Vaccine: గుడ్ న్యూస్.. 18 ఏళ్లలోపు వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్.!

సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో కేంద్రం దానికి తగిన చర్యలు తీసుకుంటోంది..

Zydus Vaccine: గుడ్ న్యూస్.. 18 ఏళ్లలోపు వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్.!
Covid Vaccine
Ravi Kiran
|

Updated on: Jul 09, 2021 | 9:58 AM

Share

సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో కేంద్రం దానికి తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అలాగే 18 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ తరుణంలోనే ఓ గుడ్ న్యూస్ అందించింది.

12 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి జైడస్ వ్యాక్సిన్‌ను సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తామని డాక్టర్ ఎన్‌కె అరోరా వెల్లడించారు. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వివరించారు. రాబోయే వారాల్లో అత్యవసర వినియోగానికి జైడస్ వ్యాక్సిన్‌కు అనుమతులు వస్తాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం పిల్లలపై కోవాగ్జిన్ మూడోదశ క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయి. జైడస్ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్ కూడా సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి.. అనుమతులు లభించిన తర్వాత సెప్టెంబర్ నుంచి 12-18 మధ్య వయస్సువారికి, అలాగే 2022 జనవరి లేదా ఫిబ్రవరి నుంచి 2-18 ఏళ్ల వయస్సువారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలల పున: ప్రారంభం, ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకుని క్లినికల్ ట్రయిల్స్‌ను వేగవంతం చేస్తున్నామన్నారు.

ఇదిలా ఉంటే నిపుణుల విభాగంతో పాటు దేశ పీడియాట్రిక్ అసోషియేషన్ థర్డ్ వేవ్‌పై అంచనాలు తప్పు కావచ్చునని.. పిల్లలు సురక్షితంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వం పక్కాగా చర్యలు చేపడుతోంది. ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.. దేశవ్యాప్తంగా ఉన్న 736 జిల్లాల్లో పిల్లల కోసం పీడియాట్రిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీని తొమ్మిది నెలల్లో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అటు ఢిల్లీ, మహారాష్ట్రలతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు.

Also Read:

రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!

మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!

Follow Us
పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో మరో అప్డేట్..
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో మరో అప్డేట్..
ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్
ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్
10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్
అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా? ఇన్నాళ్లు తెలీదే
అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా? ఇన్నాళ్లు తెలీదే